Tuesday, December 29, 2009
Sunday, December 27, 2009
నేను చదివిన కొత్త (పాత) పుస్తకం

ఈ మధ్య నేను పుస్తక ప్రదర్శన జరుగుతున్న షాపులో 1921లో శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు వ్రాసిన నాటకం కొన్నాను.ఈ నాటికనే 1939లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్టిండియా ఫిలిమ్స్ వారు పుష్పవల్లి,భానుమతి లతో సినిమాగా నిర్మించారు.ఇదే భాను మతి మొదటి చిత్రం.ఈ నాటికలో సింగరాజు లింగరాజు పెళ్ళికుమార్తె తండ్రికి వ్రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ఇలా వుంటుంది!
బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి,సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు.మీ కుమార్తె చి"సౌ"కాళిందిని చి"బసవ రాజునకు చేసుకొనుటకును, అందులకై మీరు మాకు కట్నము క్రింద నైదువేల నైదువందల రూపాయలు రొక్కమును(చిక్కిన నేటీ రుపాయలకు లక్షతో సమానం) రవ్వల యుంగరము,వెండి చెంబులు,వెండి కంచము, వెండి పావుకోళ్ళు,పట్టు తాబితాలు,వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకును,ప్రతి పూట పెండ్లివారిని బ్యాండుతో బిలుచుటకును, రాకపోకలకు బండ్లు.రాత్రులు దివిటీలు ఏర్పాటు చేయుటకును, రోజుకు రెండు సార్లు పిండివంటలతో భోజనములను, మూడు సార్లు కాఫీ,ఉప్మా,ఇడ్డెనులు, దోశె,రవ్వలడ్డు,కాజా,మైసూరు పాకాలతో ఫలహారములు మా ఇస్టానుసారము అయిదు దినములు మమ్ము గౌరవించుటకు,అంపకాలనాడు మాకు పట్టు బట్టలను మాతో వచ్చు వారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకొని బజానా క్రింద 10 రూపాయలు ఇచ్చినారు గాన ముట్టినది. --సింగరాజు లింగరాజు వ్రాలు
ఇది నాటికలో కాళ్ళకూరి వరవిక్రయం లోని ఓ మచ్చుతునక.
శ్రీ బాపు ముఖ చిత్రంతో వెలువడిన ఈ పుస్తకం ధర రూ.25/-.విశాలాంధ్రలో దొరుకుతుంది. మీ దగ్గర లేకపోతే తప్పక కొని చదువవలసిన మరో మంచి పుస్తకం! ****సురేఖ
Wednesday, December 23, 2009
Sunday, December 20, 2009
ఫొటో కార్టూన్లు
Tuesday, December 15, 2009
Tuesday, December 08, 2009
అమర గానసరస్వతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
సంగీత సామ్రాజ్ఞీ, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత,భారతరత్న శ్రీమతి
యం.యస్.సుబ్బులక్ష్మిగతించి ఈ డిసెంబర్ 11 తేదీకి ఐదేళ్ళు గడుస్తున్నాయి.
ఆ మహా గాయనికి స్మృతి కవిత పేరిట నవంబర్ 2006 లో కవితా
సంకలనం వెలువడింది.అందులో డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం,లకుమ,
డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు,తనికెళ్ళ భరణి,డా.శిఖామణి,మొహమ్మద్
ఖాదర్ఖాన్ మొదలైన వారి కవితలతో బాటు నేను వ్రాసిన కవిత కూడా
చోటుచేసుకొనే అదృస్టం కలిగింది. ఈ సంధర్భంలో ఆ కవితను మీ అందరితో
పాలుపంచుకుంటున్నాను.
Sunday, December 06, 2009
Tuesday, December 01, 2009
హాసం కబుర్లు
నాకు నిత్య జీవితంలో హాస్యంగా మాట్లాడట మంటే చాలా ఇస్టం.బ్యాంకులో
కూడా కొలీగ్స్ తో,కస్టమర్ల తో అలానే మాట్లాడే వాడిని.ఒక సారి ఓ కస్టమర్ని
డిపాజిట్ వేయమని అడిగితే,"ఎలాగండి, డబ్బంతా ఇంటి మీద పెట్టేసాం,సార్"
అని అన్నాడు."అదేంటి?! ఇంటి మీద పెడితే గాలొచ్చినా,వానొచ్చినా ప్రమాదం
కదా? దయచేసి మా బ్యాంకులో పెడితే సురక్షితం!"అన్నాను.ఆయన పెద్దగా
నవ్వి మర్నాడు డిపాజిట్ ఇచ్చాడు.అలానే నే అవార్డు స్టాప్ఫ్ గా వున్నప్పుడు
మా కాష్ ఆఫీసర్ "ఈ రోజు కౌంటర్ చెయ్యండి" అంటే "కార్పెంటర్ చేత చేయించు
కోండి" అని నవ్వుతూ అనే వాడిని.ఐనా అవతలి వారిక్కూడాఆ సెన్స్సఫ్ హ్యూమర్
లేక పోతే ప్రమోదం ప్రమాదంగా మారి పోతుంది.శ్రీ వరప్రసాదరెడ్డి,యమ్బీయస్.ప్రసాద్
గారి ప్రోత్సాహంతో మా బాంకు మితృడు డివీ.హనుమంతరావు నేను మా ఇంటి డాబా
మీద ప్రసాద్ గారు,యస్వీ.రామారావు గారి అధ్వర్యంలో ప్రారంభించాము.ఆ నాటి నుంచి
ఈ నాటి వరకు ప్రతి నెలా 3వ ఆదివారమ్ విజయవంతంగా నిర్వహిస్తున్నము.మాకు
సాహిత్య అభిమాని,రిటైర్డ్ పోస్ట్ మాస్టార్ శ్రీ ఖాదర్ ఖాన్ తోడు గానిలచారు.
నవ్వటం నిజంగా నవ్వులాట కాదు. నవ్వుల పాలవ కుండా మరొకర్ని కులాల పేరిట,
మతాల పేరిట నవ్వులపాలు చెయ్యకుండా నవ్వించడం మా హాసం క్లబ్ ధ్యేయం.నవ్వు
సహజమైన పైన్ కిల్లర్!నవ్వటానికి మన ముఖం లోని 17 కండరాలు పనిచేస్తే కోపం
వచ్చిన ముఖానికి 43 కండరాలకు పని చెప్పాలట! గత ఏడాది మా హాసం క్లబ్ వార్షి
కోత్సవం లో శ్రీ రావి కొండలరావు గారిని సత్కరించాము.శ్రీ కె.ఐ.వరప్రసాద రెడ్డి నా
సురేఖార్టూన్స్ పుస్తకాన్ని,హనుమంతరావు,నేను ఖాన్ రాసిన"నవ్వుల పందిరి" స్కిట్స్
పుస్తకాలను అవిష్కరించారు.ప్రతి నెలా కార్యక్రమాలలో హాస్యప్రియులు సకుటుంబంగా
పాల్గుంటున్నారు.అలనటీ ఆపాత మధురాలను యస్.కృష్ణారావు,సత్యనారాయణ గార్లు
ప్రతి కార్యక్రమం లోను క్రమం తప్పకుండా ఆలపిస్తారు.
ఎదుట మనిషిది ఏ భాషైనా,ఏ దేశం ఐనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే
మనం వారికి ఆప్తులవుతాం.
మీరూ మీ ఊర్లో ఇలాటి క్లబ్ లేకుంటే వెంటనే ప్రారంభిస్తారని ఆశిస్తూ,
"నవ్వే జనా సుఖినో భవంతు"
********************************************************
మా హాసం క్లబ్ కబుర్లు:
హసం హాస్య, సంగీత పక్ష పత్రిక 2001 అక్టోబర్ 1వ తేదీన మొదటి సంచికను
శాంతా బయోటెక్నిక్స్ అధిపతి పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి గారు,శ్రీ యమ్బీయస్
ప్రసాద్ గారు మేనేజింగ్ ఎడిటర్ గా ప్రారంభించారు.మొదటి సంపాదకీయంలో"మాకు
చేతనైన రీతిలో హాస్యాన్ని,సంగీతాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందించే ప్రయత్నం
చేస్తున్నాం.వివిధ ప్రాంతాలలో ఉన్న వివిధ వర్గాల పాఠకులు ఏదో ఒక మార్గంలో ఈ
అవకాశాన్ని వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశ.ఆరోగ్యం
అని ఎందుకంటున్నామంటే సేద తీరే మార్గాలు ఎన్నున్నా సరే అవి మోతాదు మించితే
హాని చేస్తాయి.హాస్యం,సంగీతం విషయంలో ఆ భయాలు లేవు.పైగా అవి కుటుంబ
సమేతంగా ఆనందించ తగ్గవి...." ఇలాటి మంచి పత్రిక డిసెంబర్ 2004,16 వ తేది
సంచిక ఆఖరి సంచిక అని శ్రీ వరాప్రసాదరెడ్డి గారు భాధాతప్త హృదయంతో సంపాదకీయమ్
వ్రాసారు."హాస్య,సంగీతాలపై అభిరుచి ఉన్నవారందరికీ"హాసం" గురించి తెలిసి,ఆదరించి
వుండి వుంటే ఈ లేఖ రాసే సంధర్భం వచ్చేది కాదు. తెలుగులో మంచి పత్రికలు రావని,
మంచి సినిమాలు రావని వాపోయే వారికి"ఇదీ దీనికి కారణం.ఈ ప్రతికూల ఆలోచనా ధోరణి
మారినప్పుడే మనకు మంచి కాలం" అని చెప్పడమే ఈ లేఖ ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.
కాని హాసం అభిమానులు మాత్రం చాలా ఆవేదన చెందారు.అంతకు ముందు ఏప్రియల్ నెల
ఉగాది రోజున ఉదయం 10.30 గంటలకు రాజమండ్రి లో శ్రీ రామ్ నగర్లో మా ఇంట్లో హాసం
క్లబ్ శ్రీ యమ్బీయస్స్.ప్రసాద్, శ్రీ యస్వీ రామారావు ప్రారంభించారు. ఆ విషయాలు మరునాడు
చెప్పుకుందామా మరి......
Subscribe to:
Posts (Atom)