Thursday, November 29, 2012

కార్టూనిస్టుల పండుగ

               అప్పుడే నెల రోజులై పోయింది మా కార్టూనిస్టుల పండుగ హైద్రాబాదు పబ్లిక్ గార్దెన్స్ లో
   సమైక్యభారతి వారి ఆధ్వర్వంలో జరిగి. అక్టోబరు 28, 29, 30 తేదీలలో జరిగిన ఈ
   సమ్మేళనంలో ఒకే చోట అందరు కార్టూనిస్టు మిత్రులు కలుసుకొనె మహద్భాగ్యం
   నాలాటి వాళ్లకు కలిగింది. మిత్రులు జయదేవ్ గారు, శ్రీపుక్కళ్ళ రామకృష్ణ ,శ్రీ యం.యస్.
   రామకృష్ణ, శ్రీ శంకు, శ్రీ సుధామలతో ఇదివరలో నాకు పరిచయం వున్నా శ్రీ సరసి, శ్రీ సుభానీ,
   శ్రీ అన్వర్, శ్రీ బాలి, ఆంద్రజ్యొతి శ్రీ శేఖర్,శ్రీ శ్యాంమోహన్, శ్రీ మోహన్, శ్రీ మృత్యుంజయ,
   శ్రీ గీతా, శ్రీ బ్నిం, శ్రీ దేవగుప్తం చక్రవర్తి, శ్రీ సాయిరాం ఆకుండి, శ్రీ వర్చశ్వి, శ్రీ సత్యమూర్తి,
   శ్రీ టీవీ,, శ్రీ కళాసాగర్ , శ్రీ పొన్నాడ మూర్తి, శ్రీ దేవులపల్లి, శ్రీ బాచి, శ్రీ రాంపా, శ్రీ నాగిసెట్టి,
   శ్రీమతి రాజావరం ఉష ఇలా ఎందరో కార్టూనిస్ట్ మిత్రులను కొత్తగా పరిచయం చేసుకోనే
   అదృష్టం కలిగింది. ఫేస్ బుక్ పుణ్యమా అని ఎందరో కొత్త మిత్రులు నన్ను గుర్తు పట్టి
   ఆప్యాయంగా పలుకరించడం మరువలేని అనుభూతి.
    ఆనాటి ప్రారంభ సభ (28) సరస సంభాషణలతో కార్టూనిస్ట్ శ్రీ రాంపా వ్యాఖానాలను
   జోడించి సభకు చమత్కారాల తోరణాలు కట్టి మరింత శోభాయమానంగా అలరించారు.
   మూడురోజులు జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీజయదేవ్ బాబు తదితర ప్రముఖ కార్టూనిస్టులు,
   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ నరేంద్ర లూధర్, ఐఏయస్,డా"పొత్తూరి
   వెంకటేశ్వరరావు, పూర్వ అద్యక్షులు ప్రెస్ అకాడమీ,డా" కే.వి.రమణ, ఐఏయస్ (రి) రాష్ట్ర
   ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు పాల్గొన్నారు. సమైక్యభారతి నుండి ఆహ్వానాలు
   అందుకున్న తెలుగు కార్టూనిస్టులంతా ఈ పండుగలో పాల్గొన్నారు. చివరగా-అరవై ఏళ్ళు
   పైబడిన బాలి,జయదేవ్,శంకు,రామకృష్ణ, మోహన్ ,సత్యమూర్తి, రాంపా, ఎంవీ.ఆప్పారావు
   (సురేఖ)లతో బాటు బ్నిం ( ఆయన పుట్టినరోజూ ఆ రోజేకావడం విశేషం), బి.యస్.రాజు,
   పుక్కళ్ళ రామకృష్ణ, హాస్యానందం రాము, సుధామ, శ్యాంమోహన్లను శాలువా   ,
   మమోంటోలతో సత్కరించారు. సమైక్యభారతి సత్యనారాయణ వందన సమర్పణతో సభ
   ముగిసింది.
                  శ్రీ సత్యమూర్తి, జయదేవ్ బాబులతో నేను
                 ఫుట్టినరోజు సంధర్భంగా శ్రీ బ్నిం గారికి సత్కారం
                 డెక్కన్ క్రానికల్ కార్టూన్ ఎడిటర్ సుభానీ గారితో నేను
                        కార్టూనిస్టుగా నా జీవితంలో మరపురాని రోజు

                                        శ్రీ బాపు సోదరులు శ్రీ శంకర్ గీసిన నా బొమ్మ
                              శ్రీమతి రాజావరం ఉషగారు ఆమె గీసిన కార్టూన్ పై నాకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫొటో
                              పబ్లిక్ గార్డెన్స్ హైద్రాబాదులో విరబూసిన నవ్వుల పువ్వులు