Wednesday, October 28, 2009

బొమ్మల కొలువు




ఇప్పుడు బొమ్మల కొలువులు పెట్టే సాంప్రదాయం తగ్గుతున్నది. ఏమంటే ఈ రోజుల్లో లివింగ్ రూముల్లో ఓ అద్దాల కాబినెట్ కట్టించి అందులో ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ పాపం వాటిని ఊపిరాడకుండా ఉంచేస్తున్నాము.ఐనా ఇప్పటికి విజయదశమికి సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టే అలవాటును కొంతమందైనా పాటిస్తున్నారు. తమిళనాడు లో బ్యాంకుల్లొ కూడా ఈ కొలువులు ఏర్పాటు చేస్తున్నారు.


మా రాజమండ్రి లో శ్రీమతి అంబరుఖానా నాగలక్ష్మి,వారి అమ్మాయి శివ దీపిక ప్రతి సంక్రాంతికి పెట్టే కొలువుకు పేరంటాళ్ళే కాదు,వివిధ టీవీ ఛానళ్ళ వారు,ప్రింట్ మీడియా వాళ్ళు తప్పక వస్తారు. క్రిందటి ఏడాది కొలువు విశేషాలను ఆంధ్రజ్యోతి ఆదివారం మాగజైన్లో వేశారు కూడా.సన్ టివి కూడా చూపించడం విశేషం!


ఇప్పటికి లక్షల రూపాయలు శ్రీమతి నాగలక్ష్మి ఖర్చు చేయింఛారు వారి శ్రీ వారు ఏజియం.గాంధి చేత. ఆ బొమ్మల కొలువు మీకూ చూపించాలనిపించింది.ఛూశాక మీకూ ఈ సారి తప్పక బొమ్మల కొలువు పెట్టాలనిపిస్తుంది!

No comments:

Post a Comment