Saturday, November 21, 2009

నిత్యకళ్యాణం-పచ్చతోరణం-మన సంప్రదాయాలు



నేను ఆడవాళ్ళ సాంప్రదాయాల గురించి వ్రాయటం ఏమిటని అనుకోకండి!
మన అభ్యున్నతికి తొడ్పడేది ముందుగా ఆడవాళ్ళే అన్నమాట కాదనలేం.
కొందరు ఉద్యోగాలకు బైటకు వెల్తున్నా మన సాంప్రదాయాలను చక్కగా
పాటిస్తున్నారు.ఇంట్లో పూజలు,లలితా పారాయణం లాంటివి జరుపుకుంటున్నారు.






మన సాంప్రదాయంలో కాళ్ళకు పసుపు రాసి బొట్టుపెట్టి తాంబూలం ఇవ్వటం
మంచి అలవాటు.పసుపు మంచి యాంటీ సెప్టిక్ గుణాలు కలిగివున్న విషయం
అందరికి తెలిసిన విషయమే.ఇంతకు ముందు గుమ్మాలకు పసుపు వ్రాసి పసుపు
తోనే చేసిన కుంకుమ,వరి పిండి తో బొట్లు పెట్టే వారు.ఇప్పుడు ముందు గుమ్మం
తప్ప ఇతర గదులకు గుమ్మాలే వుండటం లేదు.ఉన్న ఒక్క గుమ్మానికి పసుపు
పెయింట్ వేయించి ఏవేవో డిజైన్లు వేయిస్తున్నాం.పసుపు వ్రాయటం వల్ల కీటకాలు,
అనారోగ్యం కలిగించే క్రిములు రావని మన పూర్వికులు ఇలాటి సంప్రదాయాలని
ఏర్పాటు చేసారు.






ఇప్పుడు ప్రతి ఇంట్లో వంటింట్లోనే పంపు వుంటున్నది.పూర్వం ఎంతటివారైనా
చెరువుకో,నదికో వెళ్ళి నీళ్ళు తెచ్చుకొనేవారు.పాదాలు నీటిలో ప్రతి రోజూ
నానటంవల్ల వేళ్ళ మధ్య పుండ్లు పడేవి.రోజూ స్నానం చేసి పాదాలకు పసుపు
రాసుకోవటం వల్ల మందులా పని చేసి పుండ్లు తగ్గేవి.అలానే గుమ్మాలకు కట్టే
మామిడి ఆకుల తోరణాలు.ఆ ఆకుల ద్వారా మంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇంటి ముందు వరి పిండితో ముగ్గులు పెడీతే చీమలు లాంటి చిన్నజీవులకు
ఆహారం అందించే అలవాటును కూడా మన పెద్దలు తెలిపారు.
ఇప్పుడు ఇంట్లో కాలికి పసుపురాస్తే మార్బుల్ నేల పాడై పోతుందని భయపడు
తున్నారు.అలాటప్పుడు కాళ్ళ క్రింద ఓ ప్లాస్టిక్ షీట్ వేసి పసుపు ధైర్యంగా రాయొచ్చు.

No comments:

Post a Comment