Sunday, June 20, 2010

ఈ రోజే కాదు ప్రతి రోజూ గుర్తు వచ్చే మా నాన్నారు !

మీ ఇంట్లో ఎవరంటే నీకు ఇష్టం అని అడిగితే నేను ఈనాటికీ నాన్న అనే చెబుతాను.
మా నాన్నగారు మాతో ఓ స్నేహితుడిగానే మెలిగేవారు. అలానే ఆయన అంటే ఓ
విధమైన భయం కూడా ఉండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు బ్యాంకు నుంచి ఇంటికి
వచ్చేటప్పటికి రాత్రి చాలా ఆలశ్యమయేది. ఆయన కోసం నిద్రపోకుండా నేనూ,అక్క
సరోజిని మేలుకొని ఉండేవాళ్ళం.చెల్లి కస్తూరి మాత్రం నిద్రపోయేది. ఎంత రాత్రైనా ఓ
కొత్త పుస్తకం చదివి గాని నిద్రపోయేవారు కాదు. ఆదివారం వచ్చిందంటె మాకు
పండుగ రోజే! నాన్నగారు సండే స్టాండర్డ్ పేపర్ ( ఇందియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో
ఆదివారం మాత్రం ఆ పేరుతో వచ్చేది)లోని కామిక్స్ చదివి వినిపించేవారు. అందులో
మజీషియన్ మాండ్రేక్, బ్రింగింఅప్ ఫాదర్, లిటిల్ కింగ్ రంగుల కామిక్స్ వచ్చేవి. టిట్
బిట్స్, శంకర్స్ వీక్లీ, ఫిల్మిండియా, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, ఆంధ్ర పత్రిక వీక్లీ, మడ్రాస్ మైల్,
చందమామ,బాల పత్రికలను కొనే వారు. అలా ఆయన నాకు పుస్తకాలమీద,పత్రికల
మీద అభిరుచిని పెంచారు. సినిమాలు ఎలా తీస్తారు, కార్టూన్ సినిమాలు ఎలా తయా
రవుతాయి లాంటి విషయాలను చెప్పేవారు. ఆదివారం మార్నింగ్ షోలకు ఇంగ్లీష్
సినిమాలకు తీసుకొనివెళ్ళెవారు. మైయిన్ సినిమా ముందు చూపించే మిక్కీ మౌస్
కార్టూన్లకోసం సంబరపడెవాళ్ళం. మా ఇంట్లో పెద్ద హెచ్యమ్వీ గ్రామఫోన్ ఉండేది.
1948లో స్టీవర్ట్వార్నెర్ అనే అమెరికెన్ రేడియో కొన్నారు.అప్పుడు గ్రామఫోన్ అమ్మే
శారు.ఇంట్లో నేనొక్కడినే ఏడ్చాను. రేడియోలో ఐతే పిల్లల ప్రోగ్రాములు వస్తాయి అని
నాన్నగారు నన్ను ఓదార్చడం ఇంకా గుర్తుంది. తరువాత నే ఉద్యోగం లో చేరాక
స్టీరియో రికార్డు ప్లేయర్ కొంటె నాన్న గారు ఎంతో సంతోషించారు. ఆయన చేతిలో
ఎప్పుడూ రీడర్స్ డైజెస్ట్ పత్రిక ఉండేది. 1944 నుంచి ఆ పత్రికను ఆయన కొనే వారు.
ఇప్పుడు నేను అయన అలవాటును కొనసాగిస్తున్నందుకు ఆనందం గా వుంది.
నాన్న గారు నాకు ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. ఏ నాడూ ఏ వస్తువునయినా
అరువుగా తీసుకోవద్దని. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని. అప్పుడే మనకు విలువ
గౌరవం ,మనం ఉద్యోగంలొఉన్నా లేకపోయినా ఉంటుందనే వారు. మా నాన్న గారు తన 81
ఏట దివంగతులైనప్పుడు, ఆయణ్ణి కడసారి చూడాలని వచ్చిన ఓ ప్రముఖుడు శ్మశాన
వాటికకు వచ్చి మమ్మల్ని తన కారు లొ ఇంట్లో దిగపెట్టారు. అప్పుడు మా నాన్నగారు
చెప్పిన మాటలోనిజం తెలిసింది. శెలవు రోజుల్లో నాన్న మమ్మల్ని గోదావరి రైల్వే స్టేషన్కు
తీసుకొని వెళ్ళి ప్లాట్ఫారం చివర గోదావరి బ్రిడ్జ్ వరకు తీసుకొని వెళ్ళేవారు. అక్కడ బ్రిడ్జ్
పై కాపలా ఉండే రిజర్వ్ పోలీసులు నాన్నగారిని చూసి సల్యూట్ చేస్తే మాకు చాలా గర్వంగా
ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళు మీకెలా తెలుసు అని అక్కయ్య అడిగితే మా బాంక్ రిజర్వ్
బాంక్ కి పాత నోట్లు పంపేటప్పుడు సెక్యూరిటీగా వస్తూవుంటారు అని చెబితే అదంతా ఓ
వింతగా ఉండేది. మా నాన్నగారి పేరు మట్టెగుంట వెంకట సుబ్బారావు. ఆయన ఆనాటి
ఇంపీరియల్ బాంకు లో చేరి (1955 లో స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా గా మారింది) 1959లో
రిటైర్ అయ్యారు. నాన్నగారికి క్లబ్బులకువెళ్ళడం, సిగరెట్లు లాంటి అలవాట్లు లేవు. తీరిక
దొరికితే మాతోనే గడిపేవారు. అలాటి మంచినాన్నను ఇచ్చినందుకు భగవానునికి నమో
వాకాలు అర్పిస్తూ నాన్నలందరికీఈ రోజు జేజేలు!

1 comment:

  1. Chaalaa baagaa cheppaaru.. nijamugaa meedi chaalaa goppa manasu..

    ReplyDelete