Wednesday, June 23, 2010

ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు


ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు
ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు
మంచి కధలు వ్రా(తీ)యటంలో పేరు పొందిన ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ తన కొత్త
పుస్తకం "వంశీకి నచ్చిన కధలు" పేరిట విడుదలచేశారు. రచయితగా ఆయన కధలు,"మా
పసర్లపూడి కధలు","మా దిగువ గోదావరి కధలు" చదివిన పాఠకులు ఇందులో తనతో బాటు
ప్రముఖరచయితల 50 కధలను తప్పక మెచ్చుకుంటారు. ఇందులోని ప్రతి కధా దేనికదే ఆణి
ముత్యమే! దయ్యాల కధలు, దయ్యాల లాంటి మనుషుల కధలు మనల్ని కదలిస్తాయి.శ్రీ వంశీ
తను ఎన్నుకున్న కధలతో మనను పరవిశింప జేస్తారు. "నల్ల సుశీల" అన్న ఆయన స్వంత
కధలో ఓ వర్ణన చదివితే సినిమా తెరపైలా ఆ ద్రుశ్శ్యం మన కళ్ళెదుట అగుపిస్తుంది. ఉదాహరణకు
"ఆ రోజు
పసుపురంగు పిట్ట ఒకటి టిల్లచెట్ల గుబుర్లలోకి దూరి చిగుళ్ళని మాత్రమే రుచిగా తింటోంది.
నేలమీద పడున్న పచ్చి తాటాకు మీదికి చేరిన రెండు ఎర్రతొండలు దెబ్బలాడుకుంటున్నాయి.
కొండ దిగువున మేస్తున్న గేదె వీపు మీద వాలిన కాకి నిశ్శబ్దంగా కూర్చుంది. గాలికి వూగుతున్న
సొలప చెట్టు ఆకు మీదికి జేరిన రామచిలక కిందికి జారిపోకుండా కాళ్ళతో పట్టుకుంది. గంతులేస్తూ
పరిగెత్తుతున్న చిన్న గొర్రెపిల్లని ఎలాగయినా పట్టుకోవాలని వెనకాలే పరిగెడుతున్నాడు కొండ
ముసలాడు."
చదువుతుంటే మనం అక్కడే వున్నట్టుగా అనిపించడంలేదూ!
ఇంత మంచి కధలకు శ్రీ బాపు బొమ్మలు మరింత అందాన్ని అందించాయి. ఈ 50 కధలూ
మనకు రూ.200/-లకే అన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.

1 comment:

  1. వంశీకి నచ్చిన కథలు మీద చక్కటి సమీక్ష అందించినందుకు ధన్యవాదాలు సురెఖా గారు.
    "మా పసర్లపూడి కధలు" నీ "మా పసలపూడి కథలు" గా సరిదిద్దగలరు.

    ReplyDelete