Sunday, July 18, 2010

అలనాటి టైప్ రైటర్ ఇక అగుపించదా ? !




ఇంతకుముందు మనం ఏ ఆఫీసుకు వెళ్లినా టైపు రైటర్ చేసే టిక్ టిక్ శబ్దాలు
వినిపిస్తుండేవి. ఇక ఆ టైపు నేర్పటానికి ప్రతి వీధికి ఒక ఇన్స్టిట్యూట్ అగుపించేది.
కాల క్రమాన కంప్యూటర్లు ప్రవేశించాక టైపు మిషన్లు అగుపించడం దాదాపు మానే
సాయి.ఇంతకు ముందు టైపు చేయడానికి ఓ టైపిస్టు ఉండేవాడు. ఇప్పుడో ప్రతి బల్ల
మీదా కంప్యూటర్లే ! కావలిసిన మాటర్ని టైపు చేసి సులువుగా సేవ్ చేసుకొనే
సదుపాయం కలిగింది. మరో విషయం టైపు రైటర్ అనగానే సాధారణంగా అమ్మాయిలే
టైపిస్టులుగా ఉండేవారు. మీకు "పెళ్ళినాటి ప్రమాణాలు" సినిమా గుర్తుందా. అందులో
రాజసులోచన టైపిస్టు. ఆ అమ్మాయిని ఇష్టపడే ఇద్దరు ముసలి గుమాస్తాలు అల్లు,
చదలవాడ కుటుంబరావులు చేసే కోతి చేష్టలు భలే నవ్వులు కురిపిస్తాయి.1868లో
క్రిష్టఫర్ లాతమ్ షోల్స్ మొట్టమొదటి టైపు రైటర్ కనుక్కొన్నాడు.తరువాత అతని నుంచి
రెమింగ్టన్ కంపెనీ రైట్స్ సంపాదించి ఉత్పత్తిని ప్రారంభించింది. టైపు రైటర్ని ఉపయోగించిన
ప్రముఖ రచయితలు మార్కట్వైన్,లియో టాల్స్టాయ్.. తమ రచనలకు టైపు రైటర్నే
ఉపయోగించే వారట. కొత్తది రాగానే పాతది కనుమరుగవటం సాధారణమే. కానీ OLD
IS GOLD అని మన పెద్దలమాటను గౌరవిస్తూ మీ దగ్గర ఓ వేళ పాత టైపు మిషన్ ఉంటె
పారేయకండి. పాత తరం గుర్తుగా జాగ్రత్త చేయండి. నా దగ్గర ఆ నాటి పాత టైపు మిషను
ఇంకా వుంది. ఇలా టైపు రైటర్ గురించి మీతో చెప్పటానికి కారణం ఈ మధ్య బొంబాయి
TIMES OF INDIA పత్రికలో DEATH OF THE TYPEWRITER అన్న ఆర్టికల్
చదివి, రాజమండ్రి కి తిరిగి రాగానే నా టైపు రైటర్ని ఆప్యాయంగా మరోసారి తనివి తీరా
చూసుకున్నాను.




!

No comments:

Post a Comment