Wednesday, July 21, 2010

"గణపతి" సృష్ఠికర్త శ్రీ చిలకమర్తి





హాస్య రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రధమాంధ్ర
రచయితల్లో ప్రముఖవ్యక్తి. ఆయన తన ఇరవై రెండో ఏట
మొదటి రచన చేశారు. ఆయన 1889లో రచించిన "గయో
పాఖ్యానం" నాటిక వందేళ్ళు పైగా ప్రదర్శించబడింది. కందుకూరి
తో బాటు ప్రముఖులంతా ఈ నాటికలో పాత్రలను పోషించారు.
శ్రీ చిలకమర్తి గీతామంజరి, కృపాంబోనిధి, మొదలైన శతకాలు,
సరస్వతి,మనోరమ,దేశమాత పత్రికలను నిర్వహించారు. ఆయన
వ్రాసిన "గణపతి" హాస్య నవల కడుబుబ్బ నవ్విస్తుంది. 1967లొ
ఆకాశవాణి విజయవాడ కేద్రం గణపతి నవలను రేడియో నాటకంగా
మార్పుచేసి ప్రసారం చేసి నప్పటినుంచి ఎన్నోసార్లు పున ప్రసారమయింది.
ఈనాటికను ఆకాశవాణి వారు ఆడియో సిడీగా విడుదల చేశారు.
ఇందులో గణపతిగా నండూరి సుబ్బారావు,అతని తల్లి సింగమ్మగా
పి .సీతారత్నమ్మ, పంతులుగారిగా పుచ్చాపూర్ణానందం మొదలైనవారు
నటించారు. ఈ సీడీ అమ్మకానికి ఆకాశకేంద్రాల వద్ద లభిస్తుంది.
" భరత ఖండంబు, చక్కని పాడియావు
హిందువులు, లేగదూడలై ఏద్చు చుండ
తెల్లవారను, గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు, మూతులు బిగియగట్టి" అని చిలకమర్తి విదేశీ
పాలనపై ఓ పద్యం వ్రాశారు. ఇక్కడ హిందువులు అంటే ఒక మతం
గురించి ఆయన ప్రస్తావించడం కాదని మనం గ్రహించాలి. ఆ కాలంలో
మన దేశాన్ని హిందూదేశం అనే పిలిచేవారు. మనం తెలుగోళ్ళం కాబట్టి
ఆ మధ్య కొందరు తెలుగోళ్ళు ఈ పద్యం చిలకమర్తి స్వంతం కాదని ఓ
రగడ చేశారు. ‘ఛిలకమర్తి 1867 సెప్టెంబర్ 26న రాజమండ్రిలో జన్మించారు

No comments:

Post a Comment