Thursday, August 04, 2011

కిశోర్ జీవనఝరి


నటుడు గాయకుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు ,వీటితో బాటు
హాసం ను ( అంటే హాస్యం + సంగీతాన్ని ) కలిపిన అసమాన కళా
కారుడు కిశోర్ కుమార్. కిశోర్ జీవితం లోని విశేషాలను పాఠకుల
ముందుకు అద్భుతంగా తీసుకొని వచ్చారు ప్రఖ్యాత రచయిత
కిశోర్ జీవనఝరి పేరిట వ్రాసిన పుస్తకంలో. శ్రీ ప్రసాద్ గారి ఈ రచన
లో కీశోర్ గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను అపురూపమైన
ఫోటోలతో పాఠకులకు అందించారు.
తెరపై ఎంతటి అల్లరి చేసేవాడో నిజ జీవితంలో కూడా అంతటి అల్లరి
చేసేవాడు కిశోర్. చాలా సార్లు చనిపోయినట్లు నటించి ఇంట్లో వాళ్ళని
హడలగోట్టించే వాడు. అలా ఒకసారి అతను పడిపొతే భార్య లీనా
ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. శ్వాస ఆడటంలేదు. చాతీ కేసి
చూస్తే కదలటం లేదు. డాక్టరుకు ఫోను చేసి వెంటనే రమ్మని చెప్పింది.
"కిశోర్ సంగతి నీకు తెలియనిదేముంది. ఇది కూడా అల్లరే! నేను
హడావిడిగా అక్కడికి రావటం, అతను లేచి కూర్చొని హాహాఅని నవ్వడం
మామూలే!" అని డాక్టర్ అంటే "లేదు, నిజంగా సీరియస్ గానే వుంది.
ఆలస్యం చేయకుండా రండి" అని ఆమె అనగానే "ఐతే నే వచ్చేలోగా
ఇలా ఫస్టైడు చేయండి" అన్నాడు .డాక్టర్. లీనా నోట్ చేసుకోడానికి
పాడ్, పెన్నుకోసం పక్కకు తిరగ గానే ఓ చెయ్యి వాటిని అందించింది.
తల తిప్పి చూస్తే కిశోర్. అలా ఆమెను ఆట పట్టించాడు.

ఎమర్జన్సీ చీకటి రోజుల్లో ప్రభుత్వ పధకాలకు పబ్లిసిటీ కొసం తారలందరూ
పాల్గొనాలని అంటే కిశోర్ పాలకులను ధైర్యంగా ఎదిరించి ఆ కార్యక్రమాలలో
కిశోర్ మాత్రం పాల్గొనలేదు..అందుకు కోపగించిన ప్రభుత్వం రేడియో,టీవీ
లలో కీశోర్ పాటలు వినిపించ రాదనే ఆంక్షలు విధించారు.
కిశోర్ కుమార్, ఆశోక్ కుమార్, అనూప్ కుమార్ ఈ ముగ్గురు సోదరులు
కలసి నటించిన "చల్తీ కా నామ్ గాడీ" ఈ నాటికీ మేటి హాస్య చిత్రంగా
నిలచింది. మరెన్నో కిశోర్ జీవిత విశేషాలను తెలుసు కోవడానికి "హాసం"
ప్రచురించిన ఈ పుస్తకం కిశోర్ అభిమానులంతా తప్పక చదివి స్వంతం
చేసుకోవలసిన అపురూపమైన పుస్తకం. ఇందులో కిశోర్ పాడిన పాటలు
వాటి తెలుగు అర్ధం వివరించడం ప్రత్యేకత.ఈ పుస్తకం గురించి శ్రి వి ఏ కె.
రంగారావు గారు తన ముందు మాటలో ఇలా అంటారు. "యీ పుస్తకంలో
ఎక్కడా మనస్సు చివుక్కుమనిపించే మాటల్లేకపోవడం అందరినీ మెప్పిస్తుంది.
అలా అని కిశోర్ పిచ్చికళలు, పెళ్ళి చేష్టలు ( నాలుగు),వివాహనికి పూర్వమే
సహనివాసం చేయడం-ఏదీ దాచి పెట్టబడలేదు"

3 comments:

  1. "...ప్రభుత్వం రేడియో,టీవీ
    లలో కీశోర్ పాటలు వినిపించ రాదనే ఆంక్షలు విధించారు..."

    I very well remember, that was March, 20 1977 Election Results were coming. By night 12.30 or 1.00 it was evident Congress was losing badly. AIR, Vijayawada started playing only Kishore Kumar Songs in between election result bullitins. By that time Emergency was still on. On one hand the josh of Election results and on the other hand Kishore Songs, we enjoyed a lot. Hats of to those Announcers and Officers of AIR who took that decision to play Kishore Kumar Songs while elections results were announcing Congres defeat.

    ReplyDelete
  2. :Mr. Prasad informs -
    thanks for mention of my book
    Glad to share some more info on the book -
    The book is due for third edition
    It has been translated into Kannada by Ms.Sulochana (Shimoga) and serialized in a reputed Kannada weekly "Karma Veera". Then it came in book form.
    regards
    prasad mbs

    ReplyDelete