Friday, August 19, 2011

నేడే ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవం

1827లో ఫొటొలు తీయడానికి ఆనాటి శాస్త్రవేత్త జోసెఫ్ నెప్పర్ నీప్సే చేసిన
ప్రయత్నమే ఈ నాటి ఫొటొగ్రఫికీ మూలమైంది. ఆనాడు అతను పావురాలను
ఫొటో తీయడానికి దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
డాగ్రే అనే మరొ శాస్త్రవేత్తతొ కలసి ఎనిమిది గంటలనుంచి గంటలో తీయడానికి
ప్రయత్నించి విజయం సాధించ గలిగారు. 19 ఆగష్టు 1839 తమ ప్రయోగానికి
వారు పేటెంటు ఫ్రెంచి ప్రభుత్వం నుంచి పొందారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది
ఆగష్టు 19 ను ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది.
పకృతిలోని సుందర దృశ్యాలను మన కమేరాలో బంధిస్తే అవి మధుర దృశ్యాలుగా
కల కాలం నిలచి పోతాయి. ఈ ఫొటో సూర్యాస్తమయ సమయంలో గోదావరి, రెండు
వంతెనల మధ్య వెలిగి పోతున్న సూర్యభగవానుడిని నేను తీసినది.


అలానే మన ఇంట్లో చిన్నపిల్లల బాల్యాన్ని ఫోటోలుగా తీసి పదిలపరిస్తే వాళ్ళు
పెద్దయ్యాక చూసుకుంటే అది వాళ్ళకు మధురానిభూతే కదా! ఈ ఫొటోలో మా
మనవడు చిII నృపేష్ ను ఉదయం పేపరు మార్నింగ్ కాఫీ త్రాగుతూ చూస్తున్నట్లు
తీశాను
ఈ ఫొటో చిII నృపేష్ తమ్ముడు చిII హ్రితేష్ మా అమ్మాయి మాధురి మొదటిసారి
స్కూలుకు(చెన్నై) తీసికు వెళుతున్నప్పుడు తీసినది.
మా రెండో అమ్మాయి లక్ష్మీమాధవి (ముంబాయి) పాప అక్కడే వున్న ముంబాయి
మిర్రర్ పట్టుకుంటే సరదాగా తీసిన ఫొటో


చిన్నపిల్లలు అమాయకంగా పెద్దవాళ్ళను అనుకరిస్తూ చేసే ప్రతి పనీ ముచ్చటగా
వుంటుంది. మా అబ్బాయి కృష్ణసాయి (ముంబాయి) బాబు చిII కౌస్తుభ్ ఫోనుతో
ఆడు కుంటుటున్నప్పుడు తీసిన ఫొటో..
వరల్డ్ ఫొటోగ్రఫీ రోజున ఛాయాచిత్రకారులందరికీ శుభాకాంక్షలు.

1 comment:

  1. chaalaa informative gaa vundi...and also your collection of memories is good...That is Appa Rao anettu unnaayi...kudos....

    ReplyDelete