Thursday, May 06, 2010

జానపద నవలా సామ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం "రచన" ప్రత్యేక సంఛిక



రచన దాసరి సుబ్రహ్మణ్యం స్మృతి సంచిక
చందమామ అభిమానుల కోసం "రచన" మే నెల సంచిక 244 పేజీలతో
వెలువడింది. ఇందులో చందమామలో తోకచుక్క, మకరదేవత లాంటీ అద్భుత ధారా
వాహికలను వ్రాసిన జానపద నవలా సామ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి
కొదవటిగంటి రోహిణీ ప్రసాద్,డా.వెలగా వెంకటప్పయ్య, వసుంధర, యండమూరి వీరేంద్ర
నాధ్, మన తెలుగు చందమామ బ్లాగు నిర్వహుకులు శివరామప్రసాద్ కప్పగంతు,
చందమామ డాట్ కమ్ కె.రాజశేఖరరాజు, ,రచన శాయి మొదలయిన చందమామ
ప్రేమికుల రచనలతో బాటు అలనాటి చందమామ చిత్ర కారుడు "చిత్రా" గారి చిత్రాలు,
వారిపై ఈనాటికీ బొమ్మలు గీస్తున్న శ్రీ శంకర్ గారు వెలిబుచ్చిన జ్ణాపకాలు పొందుబరచ
బడ్డాయి. చందమామ అభిమానులు కలకాలం పదిలపరచుకోవాల్సిన ఈ "రచన" సంచికను
ఈ రోజే కొనుక్కోండి.. మీకు స్ధానికంగా దొరకక పోతే rachanapatrika@gmail.com కి
మైల్ చేసి తెప్పించుకోండి.

No comments:

Post a Comment