Monday, May 17, 2010

లోకానికి "వెలుగు" నిచ్చిన ధామస్ అల్వా ఎడిసన్






ఎంతమందో శాస్త్రవేత్తలు మనం ఈ నాడు అనుభవిస్తున్న ఎన్నో వస్తువులను
కనుగొన్నారు. వాళ్ళందరిలో నాకు చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టమైన శాస్త్రవేత్త
ధామస్ అల్వా ఎడిసన్. ఈ రోజు మనం చీకట్లో వెలుగును చూస్తున్నామంటేనూ,
మాధుర్యమైన పాటలను, సంగీతాన్ని వీనులవిందుగా ఆనందిస్తున్నామంటేనూ,
అలనాటి ప్రముఖుల స్వరాన్ని పదిలపరచుకుని ఈ తరం వారికీ వినిపిస్తున్నా
మంటేనూ దానికి మూల కారకుడు ధామస్ అల్వా ఎడిసనే. ఎలట్రిక్ బల్బు, గ్రామ
ఫోన్ మొదలైన పరికరాలను దాదాపు 1300 కనిపెట్టాడు. బల్బు కనిపెట్టడానికి
ముందు 299 సార్లు విఫలమైనప్పుడు ఎడిసన్ భార్య వేళాకోలం చేస్తే, " నేను బల్బు
కనిపెట్టడంలో ఫెయిలవ లేదు. ఏ విధంగా చేస్తే బల్బు కనిపెట్టలేమో అన్నది 299
పధ్దతుల్లొ తెలుసుకున్నాను" అని జవబిచ్చాడట., ఓటమి నుంచి కూడా పార్థాలు
నేర్చుకోవచ్చని ఎడిసన్ నిరూపించాడు. ఎడిసన్ ఒక సారి చిన్న దీపం పెట్టుకొని
చదువుకుంటూ వుండగా గాలికి దీపం ఆరిపోయింది. గాలి తగిలినా కూడా ఆరిపోని
దీపాన్ని కనుక్కోవాలనే ప్రయత్నమే ఆయన సృష్టించిన నేటి ఎలట్రిక్ బల్బుకు నాంది
అయింది. ఇక్కడ మీరు చూసే బొమ్మల్లో ఎడిసన్ కనుగొన్న మొదటి గ్రామఫోన్
ప్రకటన, వాక్స్ సిలిండర్ మీద పాటను రెకార్డు చేయటం, మొదటి ఎలట్రిక్ బల్బు,
అలనాటి గ్రామఫోన్ ( ఈ గ్రామఫోన్ నా దగ్గర వుంది) ఎల్పీ రికార్డు, నేటి అదునాతన
సిడీ బొమ్మలున్నాయి.

No comments:

Post a Comment