Tuesday, August 24, 2010

కార్టూనిస్ట్ గా శివసేన నేత బాల్ ధాకరే



రాజకీయనేతగా మారిన కార్టూనిస్ట్ ,బాల్ ధాకరే

నా దగ్గర చాల మంది ప్రముఖ కార్టూనిస్టుల కార్టూన్ పుస్తకాలు
ఉన్నాయి. కాని శివసేన నేత బాల్ ధాకరే కార్టూను పుస్తకం లేదు.
chitrachalanam.blogspot.com విజయవర్ధన్ గారు ఆ పుస్తకం
నా కలెక్షన్లలొ లేదని తెలిసి నాకు కానుకగా పంపించారు. శ్రి విజయ
వర్ధన్ గారికి ధన్యవాదాలు తెలియజెస్తున్నాను. Laughter Lines
అనే 210 పేజీల ఈ పుస్తకానికి ప్రముఖ పాత్రికేయులు శ్రీ యం.వీ.
కామత్ వాఖ్యానం వ్రాసారు. ఈ పుస్తకంలో శ్రీ ఆర్కే లక్ష్మణ్ గారి
కార్టూన్లతో బాటు 1946 లో FREE PRESS JOURNAL లొ
కార్టూనిస్ట్ గా పనిచేసిన శ్రీ బాల్ ధాకరే గారి కార్టూన్లు కూడా వున్నాయి.
ఆర్కే లక్ష్మణ్ , బాల్ ధాకరేలు కార్టూనిస్టులుగా ఆ పత్రికలో పని చేసిన
సమయంలొ శ్రి యమ్వీ కామత్ రిపోర్టర్ గా పనిచేసారట. అందరూ ఆ చివర
నుంచి ఈ చివరకు వుండే పెద్ద హాల్లొ ఆ ఇద్దరు కార్టూనిస్టుల సీట్లు హాలుకు
ఆ చివరగా వుండటం వల్ల కామత్ గారికి వాళ్లని కలసే అవకాశం వుండేదే
కాదట. శ్రి ఆర్కే లక్ష్మణ్ కార్టూనిస్ట్ గా తన జీవితాన్ని ఈ నాటి వరకు
గడుపుతుంటే , ధాకరే మాత్రం శివసేన నేతగా ఎదిగిపోయారు. ఇక్కడ
మీరు బాల్ ధాకరే గీసిన ఓ కార్టూన్ ,
, The Cartoon Craft of R K Laxman & Bal Thackeray,
పుస్తకం చిత్రాన్ని చూస్తారు.

No comments:

Post a Comment