Wednesday, September 08, 2010

రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ శత జయంతి


గోపీచంద్ (08-09-1910 : 02-11-1962)
మరణించాక కూడా చిరకాలం పాఠకులహృదయాల్లో చిరంజీవిగా
వుండే అదృష్టం రచయితలదే. అలాటి అదృష్టవంతుడు త్రిపురనేని
గోపీచంద్. చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన "ఆంధ్రజ్యొతి" మాస
పత్రిక,అటుతరువాత"యువ"లోను ఆయన వ్రాసిన "పనిలేని మంగలి" శీర్షికలో
వ్రాసిన రచనలు పాఠకుల విశేష ఆదరణ పొందాయి. గోపీచంద్
కధకునిగా, నవలా రచయితగా , సినీ దర్శకునిగా ఇలా అన్నిరంగాల్లోను
ప్రతిభను చాటారు." అసమర్ధుని జీవనయాత్ర", "పోస్టు చేయని ఉత్తరాలు",
"యమపాశం"," పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా" మొదలైన ప్రశిద్ధ
రచనలు ఆయన కలంనుంచి వెలువడిన ఆణిముత్యాలు. గోపీచంద్
శతజయంతి సంధర్భంగా "రచన" సెప్టెంబరు సంచికను విశేషసంచికగా
విడుదల చేశారు..ఈ సంచికలో శ్రీ గోపీచంద్ రచనలు కొన్నిటిని
" ఇలాజరిగేను", "చిత్తజల్లు" (పోస్ట్ చెయ్యని ఉత్తరాలు)," గోడమీది
మూడోవాడు","గల్పికలు", "ధర్మవడ్డీ"",ప్రఖ్యాతుని భార్య",""జనానా" చదివే
సదావకాశం అభిమానులకు ఈ "రచన" ద్వారా కలుగుతుంది.
గోపీచంద్ గురించి మహాకవి విశ్వనాధ సత్యనారాయణ గారు
ఇలా అన్నారు :
ఒక మర్యాదను కలిగిన కులమున పుట్టుటయె గొప్ప గోపీచంద్
ఒక మంచి వంశమందున జనియించుట మరియు గొప్ప గోపీచంద్
ఒక గొప్ప తండ్రి కడుపున పుట్టుట యింకొక్క గొప్ప గోపీచంద్
ఒక గొప్ప చదువు చదువుట మరియు నదృష్టమ్ము నువ్వె గోపీచంద్.
గోపీచంద్ గారి శతజయంతి సంధర్భంగా ఆయన సమగ్ర సాహిత్యాన్ని
"అలకనంద ప్రచురణ" సంస్ధ వారు "గోపీచంద్ సినీ రచనలు"
( రైతు బిడ్డ, గృహప్రవేశం, లక్షమ్మ) 400 పేజీల పుస్తకాన్ని,వెల.రూ.250/=
ప్రచురిస్తున్నారు. శతజయంతి ముగింపోత్సవాల నాడు (8-9-2010)
రవీంద్రభారతి ప్రాంగణం లోదొరుకుతాయి.

No comments:

Post a Comment