Monday, September 13, 2010

రోజులు మారాయి




దున్నేవాడిదేభూమి అనే నినాదంతో సారధీ వారు నిర్మించిన
"రోజులు మారాయి" చిత్రం 14 ఏప్రియల్ 1955 తేదీన
విడుదలయి అఖండ విజయం సాధించింది. ఈ సినిమా
తోనె వహీదా రెహ్మాన్ పరిచయమై హిందీ చిత్రసీమలో
హీరోయిన్ గా స్థిర పడింది. ఈ చిత్రంలో ఆమె ఓ నృత్య
సన్నివేశంలో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో జిక్కీ
గానం చేసిన ఏరువాక సాగారో రన్నా-చిన్నన్నపాటకు నృత్యం
చేసింది. అక్కినేని నాగేశ్వరరావు, జానకి,సియస్సార్,
రేలంగి,పెరుమాళ్ళు, అమ్మాజీ ముఖ్య తారాగణం.
సంగీత దర్శకుడు వేణు వివిధ రకాల వాయిద్యాలను
వాయించడంలో ప్రావీణ్యం గలవారు. హార్మోనియం,పియానో,
సితార్,గిటార్,దిల్రుబా,మాండోలిన్,ఎకార్డియన్,ఫ్లూట్,సెల్లో,
వుడోఫోన్,జలతరంగిణి,హెమండ్ ఆర్గన్ వంటి పదిహేను
రకాల వాయిద్యాలను వాయించగలిగేవారట. ఆయన స్వర
పరచిన ఐదు పాటలు, "ఇదియే హాయి కలుపుము చేయి",
"రండయ్య పోదాము మనము,లేచి రండయ్య పోదాము
మనము" ఈ పాటను ఘంటసాల బృందం పాడగా,అక్కినేని,
జానకి, సీతారాం మొ"అభినయించారు, "కల్లాకపటం కానని
వాడా లోకం పోకడ తెలియనివాడ ఏరువాక సాగారో రన్న
చిన్నన్న" .జానపద గీతాలను సినిమాలలో ప్రవేశపెట్టాక
"రోజులు మారాయి" సినిమాను ఉదహరించకుండా వుండ
లేము..ఇక మరో పాట, "ఎల్లిపోతుందెల్లి పోతుంది జోడెడ్ల
బండి ఎల్లిపోతుందెల్లి పోతుంది పెళ్ళోరి బండి" ఈ పాటను
మాధవిపెద్ది సత్యం గానం చేయగా వల్లం నరసింహారావు పై
చిత్రీకరించారు. ఈ సారి "రోజులు మారాయి" చిత్రం చూసి
వుండక పోతే తప్పక సీడీ కొనుక్కోని చూడండి. ఇంట్లో
సీడీ లైబ్రరిలో తప్పక పదిల పర్చుకోవలసిన మంచి సినిమా.
ఈ సినిమా దర్శకుడు తాపీ చాణుక్య, మాటలు వ్రాసింది
కొండేపూడి లక్ష్మీనారాయణ,పాటలు తాపీ ధర్మారావు,
కొసరాజు.మంచి సంగీతం,కధ,అభినయనం కలిగిన సినిమా
రోజులు మారాయి.
,

No comments:

Post a Comment