Saturday, February 12, 2011

హరికధా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారు (1865-1945 )

ఆదిభట్ల నారాయణదాసుగారు హరికధా పితామహులే కాకుండా ఎన్నెన్నో
రంగాల్లో నిష్టాతులు. ఆయన అనేక భాషలు మాట్లాడగలిగేవారు అష్టావధానాలు
చేశారు. ఆయన దాదాపు 21 హరికధలను స్వరపర్చారు. సంస్కృతాంధ్రాలలో
నూటికి పైగా గ్రంధాలను రచించారు. ఆయన చమత్కారి. ఒకసారి శ్రీదాసుగారు
హరికధ చెప్పడానికి ఉపక్రమించగానే ఆ సభలో వున్న ఓ కోణంగి హరికధ కాదు
గిరికధ చెప్పండి అని వేళాకోళంగా అన్నాడట. వెంటనే దాసుగారు నవ్వుతూ,
"అలానే నాయనా, గిరికధే చెప్పుకుందాం" అని గిరిజాకళ్యాణం" ప్రారంభించారట.
మరో సంధర్భంలో శివుని పై ప్రార్ధనను హాస్యంగా ఇలా చెప్పారట!

హెడ్డున మూను, స్కిన్నుపై అంతను డస్టును ఫైరు నేత్రమున్,
సైడున గ్రేట్ బుల్లు, బహు చక్కని గేంజస్ హెయిర్ లోపలన్,
బాడీకి హాఫెయౌచు నల పార్వతి మౌంటెన్ డాటరుండ,
ష్టుడ్డు డివోటీ దండము, ప్రేయరు చేయుచున్.

ప్రఖ్యాత రచయిత, కార్టూనిస్ట్, కళారత్న శ్రీ బ్నిం తన "మరపురాని మాణిక్యాలు"
లో ఇలా అన్నారు.

కమనీయం ఆ కవనం
రమణీయమతని రాగం
"ఆదిభట్ల"స్వరకధనం
హరికధలకు స్వర్ణయుగం.

1 comment: