Friday, February 25, 2011

బుడుగు వెంకట రమణగారు






బుడుగు వెంకటరమణ ముళ్లపూడి
అక్షరాలా అక్షరాలతో చేశారు గారడి
అప్పారావు బుడుగు సీగాన పెసూనాంబ రాధాగోపాలం
వీళ్లందరితో మీరు పంచిన నవ్వులు సదా మా గుండెల్లోపదిలం !!
<><><><><><><><><>

రమణగారు పౌరాణిక కధలను , హాస్యకధలను, కరుణగాధలను రమణీయంగా
వ్రాయగలరు. ఆయన వెండితెర నవలలను తన చమత్కారాల మసాలాలను నూరి
పాఠకులకు నవరసాలను అక్షరాలతో ఆడుకుంటూ విందులను పంచారు. "ఇద్దరు
మితృలు" సినిమా నవలను హీరో గురించి ఇలా ప్రారంభిస్తారు.
"పైనున్నవాడు బహు కొంటెవాడు. పెద్దంత్రం,చిన్నంత్రం లేకుండా అందరినీ
ఆడించి, ఆడుకుంటాడు. అరక్క వీడూ, దొరక్క వాడూ అవస్థపడాగా, "వీడి"కి
వజ్రాలూ,"వాడి"కి మరమరాలూ యిస్తాడు. ఉప్పుకి,కప్పురంలా గుబాలించాలన్న
ఉబలాటం కలిగిస్తే, కప్పురానికి ఉప్పులా చవులూరాలన్న సరదా పుట్టించి తమాషా
చూస్తాడు. జీవితం ఉప్పులా కరిగిపోయి, కప్పురంలా హరించిపోయేవరకు ఈ తీరని
కోరికలతో కాలక్షేపం చేయించేస్తాడు. రామదాసుగారు (భద్రాచలం తాలూకా కాదు)
అన్నట్టు,-అంధా "వాడి" లీల."
ఆయన తెలుగు అక్షరాలతో ఆటలాడుకున్న తీరు అన్యులకు రాదు. ఇలాటి
చమక్కుల చమత్కారేలెన్నో రమణగారు చేశారు.
రమణగారూ, మీకు మా జోహార్లు!

No comments:

Post a Comment