Saturday, February 05, 2011

రచయిత, కార్టూనిస్ట్ శ్రీ బ్నిం -2010 కళారత్న పురస్కారం



బ్నిం పేరుతో అనేక కార్టూన్లు, కధారచనలు చేసిన శ్రీ బియ్యెన్మూర్తి గారికి
2010 సంవత్సరానికి కళారత్న అవార్డు వచ్చిందన్న సంతోష వార్త నాకు
రెండు రోజుల క్రితమే తెలిసింది. ఆయన కధా రచయితగా, కార్టూనిస్టుగా
ఈ పురస్కారానికి ఎన్నికయ్యారు. ఆయన వివిధ పత్రికల్లో పనిచేశారు.
చిన్నతెరకు స్క్రిప్ట్ లు వ్రాశారు. నాలుగు సార్లు నందులను( అవార్డులు )
ఇంట్లో కట్టేసుకున్నారు. ఆయన వ్రాసిన "మిసెస్ అండర్ స్టాండింగ్" పుస్తకం
ఫ్రెండ్షిప్ రోజున (2-8-09)న బాపుగారింటికి వెళ్ళినప్పుడు ,బాపు గారు, రమణ
రమణగారు సంతకం చేసి నాకు కానుకగా ఇచ్చారు. ఆ పుస్తకం గురించి
ఇంతకముందు నా బ్లాగులో పరిచయంచేశాను. బ్నిం చాలా కధలు,వ్యాసాలు
వ్రాశారు. ఆయన కధలన్నీఒక్కొక్కటి నాలుగయిదు పేజీలే వుంటాయి!
కాని ప్రతి కధ గుండెను తాకుతుంది. అక్కడక్కడ కలుక్కుమని పిస్తుంది.
కనుకొనల్నో ఒ కన్నీటి చుక్కను మనకు తెలియకుండానే రాలుస్తుంది.
"మరపురాని మాణిక్యాలు" పేరిట బ్నిం భావ చిత్రాలుగా పుస్తకంలో ఆనాటి
పెద్దలను నేటితరానికి గుర్తుచేస్తూ వారి కేరికేచర్లతో చక్కని కార్ట్యూన్లగా
మన ముందు వుంచిన తీరు ప్రశంశనీయం. ఇప్పుడు తెలుగుకూడా
చదవడం మర్చిపోయిన మన తెలుగువాళ్ళ కోసం ఇంగ్లీషులో కూడా
ఆ పెద్దల గురించి చెప్పానని బ్నిం చెప్పారు. అలా వ్రాసి ఈ పుస్తకానికి
మరింత సార్ధకతను కలిగించారు
గిడుగు రామమూర్తి గారి గురించి శ్రీ బ్నిం చెప్పిన ఓ మచ్చుముక్క!:
ప్రజలందరు చదువగలుగ
తేనెల తేటల తెలుగు
కావాలన్నట్టి గిడుగు
కవనానికి కొత్త వెలుగు

శ్రీ బాపు అందమైన ముఖచిత్రంతో 132 పేజీలతోఅందంగా ముద్రించిన ఈ
పుస్తకాలు నవొదయ, విశాలాంధ్ర దగ్గర దొరుకుతాయి (కొనుక్కోడానికి)
బ్నిం గారికి స్వయంగా అభినందనలు తెలియజేయాలంటే :
12-11-448, వారాసిగూడ,సికింద్రాబాదు-500061
ఉత్తరం వ్రాయండి. మాట్లాడాలంటే:ఇంట్లో: 040-27070169,
జేబులో: 9490745820

No comments:

Post a Comment