Sunday, February 06, 2011

కార్టూన్ పుస్తకాలు






తెలుగు వాళ్ళు హాస్యప్రియులు. మనకు కార్టూనిస్టులకు కొదవలేదు.
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు నా సురేఖార్టూన్స్ పుస్తకానికి
ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు. "భారతిలో "త.రా (తలిశెట్టి
రామారావుగారి ప్రభంధకన్య ) తరవాత తరతరానికీ ఎదిగే కార్టూన్ లు
లక్షోపలక్షలు ... ఎందరో మహానుభావుకులు ఎన్నోవేసేశారు ; మరి
ఈ తరం వారికేం మిగిల్చారు అని జాలిపడుతూ వీపు నిమరబోయాం -
వీపు బదులు పిక్కలు అందాయి. అంటే - జాలిపడే స్థితికాదు; అసూయ
పడేస్థాయికి ఎదిగారు; ఎదుగుతున్నారు. కొత్త కొత్త గీతలూ రాతలూ
జోకులూ బావిలో నీరులా వూరుతూనే ఉన్నాయి కొత్త వాళ్ళు వస్తూనే
వున్నారు.అది తరగని గని..............."
అంటె మనకు మంచి కార్టూనిస్టులకు లోటే లేదు. కానీ మునపటిలా
కార్టూనిస్టులని ప్రోత్సహిస్తున్న పత్రికలు అంతగా కనిపించడం లేదు.
శ్రీ బాపు, జయదేవ్, శంకు, చంద్ర, బాలి,రాగతి పండరి, సరసి కార్టూన్లు
ఇప్పటికీ అలరిస్తూనే వున్నాయి. ఈ ప్రముఖుల కార్టున్లన్నీ పుస్తక
రూపంలో వచ్చాయి. కానీ ఎందుకో శ్రీ శంకుగారు తమ కార్టూన్లను
పుస్తకంగా ఇంతవరకూ తీసుకు రాలేదు. త్వరలో ఆయన కార్టూన్లూ
పుస్తకంగా వస్తాయని ఆశిద్దాం.
ప్రముఖ తెలుగు కార్టూనిస్టుల కార్టూన్లన్నీ కలిపి రచనశాయి గారు
"రచన కార్టూన్లు " పేర ఓ పుస్తకాన్ని ( వాహిని బుక్ ట్రస్ట్ ) ప్రచురించారు.
ఇందులో 79 కార్టూనిస్టుల 242 కార్టూన్లు వున్నాయి. ఇంగ్లీష్ లో( విదేశీ)
మాత్రం ఇలాటి కార్టూన్ల సంకలనాలు ఎక్కువగా వెలువడుతాయి.
వాటిలో FUNNY BUSINESS, KISS ME YOU FOOL, CARTOON
LAUGHS, LOVER BOY పుస్తకాలు నా దగ్గరవున్నాయి ఆర్కే లక్ష్మణ్,
బాల్ ధాకరే ల కార్టూన్ల పుస్తకం గత ఏడాది శ్రీ విజయవర్ఢన్ నాకు కానుకగా
అందించారు. INDIA TODAY BOOK OF CARTOONS పేరిట అజిత్
నైనాన్. మారియో., ఎమ్వీ శంకర్ , అబూ, జయంతొ, మంజుల, మిక్కీ పటేల్,
పూరి,, పొన్నాప్ప మొదలైన ప్రఖ్యాత కార్టూనిస్టుల కార్టూన్లతో 2000 సం"
లో ప్రచురించారు. FUNNY WORLD ! పేరుతో అజిత్ నైనాన్ కార్టూన్ల
పుస్తకాన్ని TARGET పిల్లల పత్రిక ప్రచురించింది.
గ్లాడ్చ్యూ మీట్ యూ పేరుతో శ్రీ జయదేవ్, నాగురించి నేను పేరిట
కుమారి రాగతి పండరి తమ ఆత్మకధలను వ్రాశారు. బాపు గారి గురించి
శ్రీ ముళ్లపూడి తమ "కోతికొమ్మచ్చి" లొ జతగా వ్రాశారు.

1 comment:

  1. ఇక నేం, మీ యింట నవ్వులే నవ్వులు. వీటిలో ఐదు పుస్తకాల వరకూ నా దగ్గర ఉన్నాయి లెండి.

    ReplyDelete