ఎన్నో ఏళ్ళుగా మూత పడిన ఈ అందాల అలనాటి వంతెన నిరుపయోగంగా వుంచకుండా
వందేళ్లనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు గుర్తుగా ఈనాటి తరం మరచిపోకుండా సుందరంగా తీర్చి
దిద్దితే బాగుంటుందని ప్రజలు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఇంతవరకూ
ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగటంలేదు. స్థానిక ప్రజాప్రతిధినులు కేంద్రంలో, రాష్ట్రం
లో ఒకే పార్టీకి చెందినా ఎందుకో ఈ విషయంలో శ్రర్ధ వహించటంలేదు. పర్యాటక మంత్రిగా
పదవిలో వున్న చిరంజీవి ఈ విషయంలొ చూపుసారించాలి. . మొన్ననే వచ్చిన
మన రాష్ట్రానికే చెందినన రైల్వే సహాయ మంత్రి గారు కూడా ఈ విషయంలో పెదవి విప్పక
పోవటం అత్యంత విచారకరం.ఆనాటి బ్రిటిష్ ఇంజనీర్ హేవ్ లాక్ సారధ్యంలో మూడేళ్ళ
అతి స్వల్పకాలంలో ఈ వంతెన నిర్మింపబడటం విశేషం.
1897 నవంబరు లో నిర్మాణం ప్రారంభమైన ఈ వంతెన ఆగస్టు 30 వతేదీ,1900 సంవత్సరం
రైళ్ల రాకపోకలకు ప్రారంభించబడింది. ఇక్కడ మీరు ఆనాటి శిలాపలకాన్ని చూడొచ్చు. !!
పుష్కర్ ఘాట్ వద్ద ఇప్పటికీ ఆ శిలాఫలకం పదిలంగా వుంది.
ఇదే మరో ఏ దేశమైనా, అంతెందుకు మనదేశంలోని మరో రాష్ట్రమైనా ఈ వంతెన గురించి
శ్రర్ధ తీసుకొనే వారు. ఏం చేస్తాం మనం తెలుగువాళ్ళం. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని
ఆరోజుల్లో మూడేళ్ళ స్వల్పకాలంలోఅనుకున్న దాని కంటే తక్కువ వ్యయం తో నిర్మించిన
ఈ వంతెన దాదాపు వందేళ్లకు పైగా సేవ లందించింది.ఈ.వంతెనను స్మతి చిహ్నంగా పదిల
పరచుకోవసిన భాధ్యత మనందరీదీ !!
మీరు చెప్పినట్టు దానిని ఒక స్మృతిచిహ్నంగా పదిలపరిస్తే ఎంతబాగుంటుంది....
ReplyDeleteనేను ఒక టపా కూడా రాశా నా బ్లాగులో, దీని గురించి. ఈ వంతెనను అశ్రద్ధ చేస్తే పాడయిపోతుంది. ఉపయోగిస్తే బాగుంటుంది, పెద్దలికి పట్టడం లేదు.మంచి టపా బావుంది
ReplyDelete