Wednesday, March 17, 2010

లక్ష్మణ రేఖలు






ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ పూర్తి పేరు రాసిపురం క్రిష్ణస్వామి లక్ష్మణ్.
ఆయన పుట్టిన మైసూర్ లోనే విద్యాభ్యాసము చేశారు. విద్యా పూర్తయిన తరువాత
బొంబాయిలోని ఫ్రీప్రెస్ జర్నల్ వార్తా పత్రికకు కార్టూనులు గీయటం ప్రారంభించారు.
తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు కార్టూన్ ఎడిటరు గా ఉద్యోగంలో చేరారు.
శ్రీ లక్షణ్ తన సోదరుడు ఆర్కే నారాయణ్ లాగే ఎన్నో కధలు, వ్యాసాలు, టూరిజం
పై వ్యాసాలు రచించారు. "హోటల్ రివిరియా","ది మెసెంజర్" అనే నవలలు వ్రాసారు.
" ది టనల్ ఆఫ్ టైమ్ " పేరుతో ఆత్మ కధ రచించారు. పద్మభూషన్ ఎవార్డ్ ఆయన్ని
వరించింది. మరట్వాడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ తో సత్కరించింది.
ఇంకా ఏసియన్ టాప్ జర్నలిజం ఎవార్డ్, రొమొన్ మెగసెస్ ఎవార్డ్ పొందారు !!
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన అనుదినం గీసే పాకెట్ కార్టూన్లలో తప్పని సరిగా
కామన్ మాన్ పాత్ర ఏదో ఒక చోట తప్పక అగుపిస్తుంది. ఆ పాత్ర విగ్రహాన్ని అవిష్కరించారంటె
ఆయన పాఠకుల హ్రుదయాల్లో ఎంతగా చొచ్చుకు పోయాడొ తెలుస్తుంది.

No comments:

Post a Comment