Saturday, October 09, 2010

పక్షి దాచిన జాబు (1953) చందమామ కధ!



"చందమామ"లో సాధారణంగా ఎటువంటి కధలు మనం
చదువుతాం.రాజకుమారులు, మాంత్రికులు,దేవకన్యలూ,
ఎగిరే గుర్రాలు ఇలా మనల్ని మరోవింతలోకాలకు తీసు
కొని వెళ్ళే కధలు. సాంఘిక కధలు, ఆసలు అగుపించవు.
ఐనా 1953 మార్చి సంచికలో "పక్షి దాచిన జాబు"అనే
సాంఘిక కధ, వి.నారాయణమ్మ గారు వ్రాసింది ప్రచురించ
బడింది. ఈ కధ ప్రారంభమే ఇలా సాగుతుంది!
"మద్రాసు,త్యాగరాయనగరులో రత్నం,సీతాపతి,అని
యిద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు.చిన్నప్పటి
నుంచి ప్రాణస్నేహితులుగా పెరిగారు"
క్లుప్తంగా కధ ఏమిటంటే ఓ నాడు ఈ ఇద్దరూ బజారులో
చిత్రంగా దెబ్బలాడు కొంటారు. మరు నాడు సీతాపతి నెత్తురు
మడుగులో చనిపోయి అగుపిస్తాడు. అందరూ రత్నాన్ని
అనుమానిస్తారు.పోలీసులు రత్నాన్ని అదుపులోకి తీసు
కొంటారు. ఈ లోగా ఆ ఊరి గుడి గోపురం పైకిఎక్కి ఆట
లాడు కొంటున్న పిల్లల్లొ ఒకడికి గుడి గూటిలో ఓ ఉత్తరం
అగుపిస్తే దాన్ని తన తండ్రికి చూపిస్తాడు.అందులో సీతాపతి
తను చెడువ్యసనాలకు బానిసైనానని, స్నేహితుడు రత్నం ఎంత
చెప్పినా వినలేదని, అప్పుల్లో కూరుకుపోయిన తను ఆత్మ
హత్య చేసుకొంటున్నాని వుంటుంది.అది అతని దస్తూరీ
అని నిర్ణయించి రత్నాన్ని విడుదల చేస్తారు.ఇదీ "పక్షి
దాచిన జాబు" కధ. ఇలా "చందమామ"లో ఓ సోషల్ కధ
అబ్బాయిలు పాంటు ,ఇన్ షర్టులతో అగుపించడం ఆరోజుల్లో
మాకు వింతగా తోచింది.అటు తరువాత అలాటి కధలు
మళ్ళీ మాకు మన చందమామలో అగుపించలెదు.ఈ రోజు
1953 నాటి నా పాత చందమామ వాల్యూమ్ చూస్తుంటే
ఈ కధ అగుపించి నా భావాలు మీతో పంచుకోవాలనిపించింది.

1 comment:

  1. Appaaraavugaaroo, You have brought out a very good observation in old Chandamama. I have posted your article as it is and added my reaction in our common blog MANA TELUGU CHANDAMAMA which can be accessed with the following web address:

    http://manateluguchandamama.blogspot.com/

    ReplyDelete