Sunday, October 24, 2010

యశస్వీ.రంగారావు



విస్వనట చక్రవర్తి యస్వీ రంగారావు గురించి చెప్పటమంటే
అది సాహసమే. మాంత్రికుడిగా ఆయన "పాతాళభైరవి"లో
చేసిన అభినయనం , " సాహసం చేయరా ఢింభకా" అన్న
ఆ గంభీర స్వరం ఈ నాటికీ తెలుగు ప్రేక్షకుడి చెవిలో అలా
ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. తెలుగులోనే కాదు, తమిళ చిత్ర
సీమలో కూడా అయన కంఠస్వరం, ఉచ్చారణ తమిళులు
పలికినంత సహజంగా వుంటుంది. ఇలా తమిళాన్నిఅనర్గలంగా
మాట్లాడగలిగే నటిమణుల్లొ శ్రీమతి కన్నాంబ, శ్రీమతి సావిత్రి
పేర్లను చెప్పుకుంటారు. శ్రీ బాపు గారు తన కార్ట్యూన్లలో
ఇలా అంటారు.
క్లిష్ట పాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంక రంగారావు
హాయి గొలిపే టింగురంగారావు.....
ఇంత అందంగా సాగిపోతుంది ఇంకా వ్రాస్తూ చివరగా ఇలా
ముగిస్తారు!
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారావు.
ఆయన మొదటి చిత్రం బి.వి.రామానందం దర్శకత్వంలో వచ్చిన
"వరూధిని" ఆ సినిమా బాక్సా ఫీసు దగ్గర భంగపడింది.తరువాత
ఎస్వీయార్ చేసిన ప్రతి పాత్ర అపురూపమే. "మాయాబజార్" చిత్రం
లో అయన పోషించిన ఘటోత్గజుడి పాత్ర ప్రేక్షకుల విశేషఆదరణ
పొందింది. యముడి పాత్రలో ఆయన్ని చూసిన అప్పటి చైనా
ప్రధాని చౌ యన్ లై అబినందించారట. భక్తప్రహ్లాద లో హిరణ్య
కశిపుడు, కీచకుడు ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు జీవంపోసారు.
పాండవ వనవాసం చిత్రం లో భీమ పాత్రధారి పద్యం, డైలాగు
చెప్పిన తరువాత దుర్యోధన పాత్ర ధరించిన యస్వీయార్,
"హ్! బానిసలు! బానిసలకింత అహంకారామా" అన్న ఒక్క
వాక్యంతో తన ప్రతిభను తెలుగు ప్రజలకు చూపించి కరతాళ
ధ్వనులందుకొన్నారు. ఇక సాంఘిక చిత్రాలలో ఆయన నటన
చిరకాలం తెలుగు సినిమాలోకం లో నిలిచి వుంటుంది.
కత్తుల రత్తయ్య మొదలైన చిత్రాలలో ఆయన వాడిన "గూట్లే",
"డోంగ్రే","బేవకూఫ్" లాంటి పదాలు ఆ రోజుల్లో బహుళ ప్రాచూర్యం
పొందాయి.నర్తనశాలచిత్రం లో ఆయన నటనకు తాష్కెంట్
చిత్రోత్సవంలో ఉత్తమ నటుడి బహుమానం అందుకోవడం
ప్రతి తెలుగు వాడికి గర్వకారణం.1974 జూలై 18న
ఆయన కీర్తీశేషులయ్యారు. తెలుగు జాతి గుండెల్లో ఆయన
చిరంజీవి.
ఈతరం హీరోలు బ్రాండ్ ఎంబాసిడరులుగా వివిధ సంస్థలకు
పనిచేస్తుంటే ఆ రోజుల్లోనే శ్రీ రంగారావు బర్కలీ సిగరెట్ కంపెనీ
ప్రకటనలలో తన ఆటోగ్రాఫుతో అగుపించేవారు!. అప్పటి సిగరెట్
కంపెనీ ప్రకటన మీరు పై బొమ్మలో చూడవచ్చు!!
* రేఖా చిత్రం బాపూగారి సౌజన్యంతో*

1 comment:

  1. బాగుంది. ఆ ప్రకటన ఏ పత్రికలో వచ్చిందండి.

    ReplyDelete