Saturday, January 08, 2011

స్వర్ణయుగంలో అన్నపూర్ణ : వెలుగు నీడలు



1961 జనవరి 6న నందమూరి "సీతారామకళ్యాణం" విడుదలయిన
మరునాడు 7వ తేదీ అక్కినేని చిత్రం "వెలుగునీడలు" విడుదలయింది.
ఈ రెండు చిత్రాలు వారి స్వంత చిత్రాలవడం, రెండూ విజయవంతం
అవటం విశేషం! ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఏక కాలంలో "తూయ
ఉళ్ళం" పేరిట నిర్మించారు. వెలుగు నీడలు చిత్రంతో శ్రీ పెండ్యాల
నాగేశ్వరరావు సంగీతదర్శకుడిగా అన్నపూర్ణా సంస్ఠలో తిరిగి ప్రవేశించడం
జరిగింది. ఆత్రేయ సంభాషణలను రచించారు. హాస్య సన్ని వేశాలకు మాత్రం
మాటలను ఆంధ్రనాటక కళాపరిషత్ లో బహు బహుమానాలు గెలిచిన
శ్రీ కొర్రపాటి గంగాధరరావుగారు కూర్చారు. వెలుగునీడలు కధ మెడికల్
కాలేజీ, విద్యార్ధులు, డాక్టర్ల వృత్తులతో ముడిపడి వుండటం వల్ల ఆ
దృశ్యాల చిత్రీకరణలో సూచనలు, సలహాలు ఇవ్వడానికి డా"శ్యామలారెడ్డి
అనే వైద్యురాలు రాత్రి తన క్లినిక్ పని పూర్తయ్యాక వచ్చి ఇంజెక్షన్ సిరెంజి
పట్టుకోవడం లాంటి సూచనలను నటీనటులకు ఇచ్చేవారట. ఆనాడు
నిర్మాణంలో అన్నపూర్ణా సంస్ఠ అంతటి జాగ్రత్తలు తీసుకొనేవారు. ఈ
చిత్రానికి శతదినోత్సవ వేడుకలను విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి
లలో జరిపారు. విశాఖపట్నం వెళ్ళే మెయిల్ మిస్సయితే నటీనటులంతా
ధర్డు క్లాసులో పాసెంజరు రైళ్ళో ప్రయాణం చేశారట! సంగీత పరంగా,
సాహిత్యపరంగా వెలుగునీడలు సమగ్రమైన సినిమా అని నిర్మాత
దుక్కిపాటి మధుసూధనరావుగారు భావించేవారు. శ్రీశ్రీ ఈ చిత్రానికి
వ్రాసిన పాటలు సాహిత్యపరంగా మరువలేనివి. ముఖ్యంగా ఆయన
వ్రాసిన " పాడవోయి భారతీయుడా" అన్న గీతం యాభై వసంతాలు
గడిచినా అందులోని సాహిత్యం ఈ నాటి పరిస్ఠితులకు వర్తిస్తుంది.
ఘంటసాల కోరస్ పాడిన ఈ పాట :
పాడవోయి భారతీయుడా !
ఆడిపాడవోయి విజయగీతిక
నేడే స్వాతంత్ర్య దినం-వీరుల త్యాగ ఫలం
నేడే నవోదయం నేడే ఆనందం ! II ఫాడవోయిII
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి,
సంబరపడగానే సరి పోదోయి
సాధించిన దానికి సంతృప్తి పొంది
అదే విజయ మనుకుంటే పొరపాటోయి !
ఆగకోయి భారతీయుడా..........
కదలి సాగవోయి ప్రగతిదారుల

ఆకాశం అందుకొనే ధరలొక వైపు,
అదుపులేని నిరుద్యోగ మింకొక వైపు!
అవినీతి, బంధుప్రీతి- చీకటి బజారు
అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు ?
కాంచ వోయి నేటి దుస్ఠితి--
ఎదిరించవోయి యీ పరిస్ఠితి!--
పదవీ వ్యామోహలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగే నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకునే వాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునే వాడే !
స్వార్ధ మీ అనర్ధదాయకం!
అది చంపుకొనుటె క్షేమదాయకం !
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం!
సకల జనుల శౌభాగ్యమే నీ లక్ష్యం !II
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే----
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం !II
ఇంకా శ్రీశ్రీవ్రాసిన "కలకానిది, నిజమైనది బ్రతుకు-కన్నీటి
ధారలలోనే బలిచేయకు","ఓ రంగయో-పూలరంగయో
ఓర చూపు చాలించి సాగిపోవయో!" పాటలు అత్యంత
ప్రజాదరణ చూరగొన్నాయి.

1 comment:

  1. ANR & Madhusudhan RAo made movies under ANNAPURNA STUDIO ,which always spread ethical values and social attachments & emotions & importance of human values.even after the movie is a hit and not screened,the movie-novel was published which were sold out like hot cakes the moment they are in shops;but such kind of environment is impossible in present days,i pity.i have read Velugu Needalu novel even after seeing the movie several times,but the experience was of different kind and more emotional and i was addicted to read it again and again.but now a days the movies from ANNAPURNA are so bad ,i dont know why ?yes commercialism has killed the golden values and respect of ONCE UPON A TIME GRAND ANNAPURNA.and also by NAGARJUNA,that is the main reason i hate him.

    ReplyDelete