Saturday, April 10, 2010

దర్శకత్వ కీర్తిని ఆర్జించిన మన ఆదుర్తి


'మూగ మనసులు' చిత్రంలో ఆచార్య ఆత్రేయ గీతం 'పోయినోళ్లందరూ మంచోళ్లూ, ఉన్నోళ్లు
పోయినోళ్ల తీపి గురుతులు'అని ఘంటసాల గాత్రం 'పాడుతా తీయగా చల్లగా' ఎంత కమనీయంగా
ఆలపించిందో, అలాటి ఎన్నో పాటలుగల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుగారు
రాజమండ్రిలో 1921లో జన్మించారు.ఆయన తొలి చిత్రం 'అమర సందేశం' చూసిన అన్నపూర్ణా
సంస్ధ తాము శరత్బాబు నవల 'నిష్కృతి' ఆధారంగా నిర్మించే 'తోడికోడళ్లు'చిత్రానికి
ఆదుర్తిని దర్శకుడిగా తీసుకున్నారు.అప్పటి నుంచి అన్నపూర్ణ నిర్మించిన చిత్రాలకు దాదాపు ఆస్ధాన
దర్శకులయ్యారు.ఆదుర్తి పూర్తిగా కొత్త నటీనటులతో 'తేనె మనసులు' నిర్మించి క్రిష్ణను 'సూపర్ స్టార్'ని
చేసారు.ఆయన దర్శకత్వం వహించిన 'నమ్మిన బంటు' విదేశాల్లో ప్రశంశలందుకొంది.ఆదుర్తి అక్కినేనితో
చక్రవర్తి చిత్ర సంస్ధ ద్వారా 'సుడిగుండాలు','మరో చరిత్ర' చిత్రాలు నిర్మించారు.డబ్బులు రాక పోయినా
ఆ చిత్రాలు మేధావుల, విమర్శకుల ప్రశంశలను అందుకొన్నాయి.
1954 నుంచి 1975లో అకాల మరణం పొందే వరకు ఆయన ఎన్నో హృద్యమైన చిత్రాలకు దర్శకత్వం
వహించారు.'మూగమనసులు' చిత్రాన్ని హిందీలో 'మిలన్'గా గోదావరీ తీరంలో సునిల్ దత్, నూతన్
మొదలయిన ప్రముఖ నటులతో నిర్మించారు.అలానే తమిళంలో'పెన్మనం','కట్టు రోజా' మొ" చిత్రాలు
నిర్మించారు.ఆదుర్తి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన శ్రీ కె.విశ్వనాధ్ ఆయన దర్శకత్వ ప్రతిభని
కల్పనా చాతుర్యాన్నీ అందుకున్నారు.శ్రీ విశ్వనాధ్ దర్శకత్వంలో 'శంకరాభరణం'లాంటి మంచి చిత్రాలు
రూపు దాల్చుకొన్నాఅయి.
ఆదుర్తి చిత్రాల లాగే ఆయన చిత్రాలలోని పాటలు కూడా చిరస్మరణీయాలే!
ఆదుర్తి రేఖాచిత్రాన్ని ఇక్కడ ఉపయోగించినందుకు శ్రి బాపు గారికి కృతజ్ణతలు.

No comments:

Post a Comment