Monday, December 13, 2010

శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యానికి 60 ఏళ్ళు !


1950 జూన్లో మొదటి సారిగా ప్రచురించబడ్డ శ్రీశ్రీ "మహాప్రస్ఠానం" ఈ ఏడాది
60 సంవత్సరాలు పూర్తి చేసుకొని షష్టి పూర్తి చేసుకొంటున్నది ! తెలుగులో
ఇప్పటికి 30 సార్లు పునర్ముద్రణకు నోచుకొన్న పుస్తకం ఇదే కావొచ్చు.
మహప్రస్థానం పుస్తకానికి "యోగ్యతాపత్రం" పేరిట ముందు మాటను ప్రఖ్యాత
రచయిత చలం జూలై 17, 1940 లోనే వ్రాశారు. కాని పుస్తకం విడుదలయింది
పదేళ్ళ తరువాత ! ఇందులోని ప్రతి కవిత వేగంగా సాగిపోతుంది. కమ్యూనిజానికి
ఆకర్షితులైన వాళ్ళే కాకుండా , ప్రతి ఒక్కరు ఈ కవితలను అమితంగా ఇష్టపడ్డారు.
తన కవితలను శ్రిశ్రీ తన మితృడు కొంపెల్ల జనార్దనరావుకు అంకితమిచ్చారు.
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు,
పదండి త్రోసుకు !
పోదాం, పోదాం పైపైకి ! అంటూ పాఠకుల్ని ప్రతి కవితా ముందుకు త్రోసుకొని
పోతుంది. పాఠక హృదయాల్లో శ్రీశ్రీ చిరంజీవి! శ్రీశ్రీ ఈ కవితల్ని"Three cheers
for Man" పేరిట స్వయంగా ఇంగ్లీషులోకి అనువాదం చేసి 1956లో ప్రచురించారు.

No comments:

Post a Comment