Tuesday, December 28, 2010

కాళీపట్నం రామారావు రచనలు


కారాగా పేరుగాంచిన శ్రీ కాళీపట్నం రామారావు గారి రచనలు మనసు ఫౌండేషన్
వారు చంద్రగారు గీసిన ముఖచిత్రం తో ప్రచురించారు. ఆయన శ్రికాకుళం లో
కధానిలయం స్థాపించారు. ఈ సంపుటిలో 493 పేజీలొని "కాళీపట్నం రామారావు
నేపధ్యం 2000" ను యధాతధంగా మీ ముందు వుంచుతున్నాను.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>
1997 ఫిబ్రవరి 22న కధానిలయం పుట్టింది. అప్పటినుంచి కధానిలయమే
కారామాస్టారూ, కారామాస్టారే కధానిలయం అయింది. ఆయన 75వ యేట
మొదలయిన ఈ పరిశోధనా గ్రంధాలయం ప్రతి యేటా ఫిబ్రవరి రెండవ శని,
ఆది వారాలలో పుట్టినరోజు సమావేశాలు జరుగుతుంటాయి. ఏడాది
పొడవునా దేశవిదేశాలనుంచి సాహిత్యాభిమానులు వస్తుంటారు.స్థానిక
రాజకీయ ప్రముఖులు సందర్శిస్తుంటారు. మీడియావారు కధానిలయం
విశేషాలు జనానికి తెలియబరచడానికి వస్తుంటారు.
ఈ సందర్శకులతో వ్యవహరించటం రామారావు జీవితంలో ఒక
ముఖ్య భాగం. కధానిలయం కోసం పుస్తకాలు, పత్రికలు సేకరించటానికి
రాష్ట్రం నలుమూలలకు తిరగడం మరో ముఖ్యభాగం. సేకరించిన వాటిని
రిజిస్టర్ చేయడమూ, వివరాలను వెతుక్కోటానికి అనువుగా పుస్తకాలలోకి
ఎక్కించటమూ అవసరమైన వారికి సమాచారాన్ని అందించడమూ వంటి
దినవారి కార్యక్రమం మరొక ముఖ్యభాగం.
ఈ పనులన్నింటిలోనూ ట్రస్టు మెంబర్లయిన .బి.వి.ఏ.రామారావునాయుడు
యగళ్ళ రామకృష్ణ, దాసరి రామచంద్రరావు,ఎన్.రమణమూర్తి వంటి వారి
సహకారం లభిస్తుంది. శ్రీకాకుళ సాహితి అన్ని విధాలా అండదండలు
అందిస్తుంది.
ఇన్నేళ్ళ కృషి ఫలితంగా
కధా నిలయానికి 12 లక్షల కార్పస్ ఫండ్ సమకూరింది. 7000 వరకూ
పుస్తకాలు, 15-20 వేల పత్రికలు లభించాయి.తెలుగు అకాడమీతో కలిసి
కధానిలయం "కధాకోశం" అనే కధల సూచిని తీసుకురాగగింది.
అయితే
1990లో మొదలయిన భారతదేశ ఆర్ధిక సంస్కరణలు ఫలితాలు
ప్రపంచీకరణ ప్రభావంగా దేశ ప్రజల దైనందిన జీవితాలలో అనేక మార్పులు
వచ్చాయి. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయంపట్ల నిర్లక్ష్యం, రియల్ ఎస్టేట్
లో ధరలు రెండింతలు మూడింతలు అవటం ,సాంప్రదాయకవృత్తుల నాశనం,
కొత్త వృత్తులు ఏర్పడటం వంటి విషయాల మీద మేధావులు ఆలోచనలు
కేంద్రీకృతమవసాగాయి. వీటన్నింటి ప్రభావం తెలుగు సాహిత్యంలో వస్తురూపంలో
కనబడసాగింది.
ఈ విషయాలమీద యజ్ఞం రాసిన కారా మాస్టారు ఏమనుకుంటున్నారన్న
కుతుహలం మీడియా ఇంటర్యూలలో వ్యక్తమయింది. అటువంటి అనేక ఇంటర్యూలు
వ్యాసాలు ఈ భాగంలో జేరాయి. 1999లో వెలువడిన కాళీపట్నం రామారావు
రచనలలో అలభ్యమైనవి ఈ భాగంలో దొరికిన మేరకు చేర్చడం జరిగింది. అందులో
"అర్ధం కాని మానవ గాధ" ( 1947లో ప్రచురితం) అనే కధ ఒకటి. రచయితగా
సామాజిక సంవేదనాశీలిగా రామారావుగారిని కొంచెం పట్టిచ్చే కధ "అన్నెమ్మ
నాయురాలు" అప్పులతో జరిగే అభివృద్ధి పట్ల రామారావు వైముఖ్యం ఈ కధలో
వ్యక్తమయింది.
వ్యక్తిగత జీవితంలో
భార్య అనారోగ్యం, పెద్దవాళ్ళవుతున్న పిల్లల వాళ్ళ సంతానాల సమస్యలు,
సన్నిహిత మితృలు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వంటి వారిని కోల్పోవడం,
పైబడుతున్న ముదిమి వంటి వాటి మధ్య రామారావు మాస్టారు కధానిలయం
అభివృద్ధి కోసం పడుతున్న శ్రమ గమనించిన ఎవరికైనా జీవనోత్సాహం
కలిగిస్తూనే ఉంటుంది. రాచకొండ విశ్వనాధశాస్త్రి సమగ్రరచనల సంపుటం
"రచనాసాగరం" పంపిణీలో ఆయన సాఫల్యం వారి జీవనోత్సాహానికి ఒక
చక్కని ఉదాహరణ. అనేక సంస్ఠలు ఈ మధ్యకాలంలో వారికి సన్మానాలు
చేశాయి.పురస్కారం అందించాయి.లోక్నాయక్ పురస్కారం ప్రముఖమైన వాటిల్లో
ఒకటి.
ఏమైనా-
కధారచయిత రామారావుగారు సాహితీ సృజనకి సమయాన్ని కేటాయించక
పోవటం "సాహిత్యద్రోహం"గా ఆయన రచనాభిమానులు భావిస్తూనేవున్నారు.
కాళీపట్నం రామారావు రచనలు (మనసు ఫౌండేషన్ సౌజన్యంతో)
మనసు ఫౌండేషన్, 2584, second Stage, Kumara Swamy Layout,
BANGALORE- 560 078 -Phone: 09845575455

1 comment:

  1. I proud to say that Sri Kara Mastaru is our maths teacher at class 7th and surprisingly I had read his book 6 saroo kathalu (aaru siisaa kathalu) after completion of my school age, till then we don't know he is a famous writer ( that is greatness of our master garu)

    ReplyDelete