Friday, March 25, 2011

1924లో అలా...మొదలైంది !!


మీరు పై ఫొటోలో చూస్తున్న ధియేటర్ రాజమండ్రిలో అతి పురాతనమైన
ధియేటర్. రాష్ట్రంలో నిర్మించబడ్డ రెండో సినిమా టాకీస్. దీన్ని 1924లో
నిర్మించారు. మొదట ఇందులో మూకీ చిత్రాలు ప్రదర్శించేవారట. భారత
చలన చిత్ర రంగంలో టాకీ చిత్రాలకు నాంది పలికిన మొట్టమొదటి చిత్రం
"అలంఅరా" (హిందీ) 1931 లో ఇక్కడ ప్రదర్శించారు. మూకీలకు అటు
తరువాత టాకీలకు వేదికగా నిలచిన ఈ టాకీస్ శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్
గా పిలచేవారు. 1983 నుండి సాయిక్రిష్ణగా పేరుమార్చారు. తెలుగువారు
తీసిన మొదటి టాకీ చిత్రం భక్తప్రహ్లాద కూడా ఇక్కడే 1931 లో ఆడింది.
విజయవాడలో మొదటి సినిమా హాలు మారుతీ ధియేటర్, రాజమండ్రిలో
కృష్ణాటాకీస్ రెండవది. విజయవాడలోని మారుతి, షాపింగ్ క్లాంప్లెక్స్ గా
మారినా ఆనాటి ఈ ధియేటర్ ఇంకా చిత్ర ప్రదర్శనను కొనసాగించడం
చెప్పుకో దగ్గ విషయం.. ఈ ధియేటర్ నిర్మాతలు నిడమర్తివారు. వారికి
రాజమండ్రిలో దుర్గాసినీటోన్ పేరిట సినిమా స్టూడియో కూడా వుండేది.
సంపూర్ణరామాయణం చిత్రం ఆ స్టూడియోలోనే నిర్మించారు. ఆ సినిమాలో
రాముడి వనవాస దృశ్యాలలో గోదావరి బ్రిడ్జ్ అగుపించిందని చెప్పుకొనేవారు.
ఇప్పుడు ఈ ధియేటర్ ఏసి/డిటీయస్ సౌకర్యాలతో మేనేజింగ్ డైరెక్టర్ నిడమర్తి
మురళి నిర్వహిస్తున్నారు. ఈ ధియేటర్లో హిందీ సినిమా "కొహ్రా" నూరు
రోజులాడింది. అంజలీ పిక్చర్స్ "సువర్ణసుందరి" రజతోత్సవం జరుపుకొంది.
ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఈ ధియేటర్లో ప్రదర్శించారు. అలా మొదలైన
ఈ హాల్లో ఇప్పుడు "అలా...మొదలైంది" విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది.

No comments:

Post a Comment