Monday, March 14, 2011

తొలినాటి గ్రామఫోను గాయకులు




ఇప్పటి మ్యూజిక్ సిస్టమ్లు, ఐపాడ్లు లేని రోజుల్లో ఆనాటి ప్రముఖుల గానం
విని ఆనందించాలంటే గ్రామఫోన్ రికార్డులే శరణ్యం. ఓ గాయకుడు రికార్డు
కంపెనీల మెప్పు పొందినప్పుడే అతని పాటలు రికార్డులుగా విడుదలయేవి.
మధుర గాయకులు ఘంటసాల మాస్టారును కూడా మొదట ఆయన గాత్రం
బాగోలేదని తిరస్కరించారట! ఆ రోజుల్లో ఓ ప్రముఖ గ్రామఫోను కంపెనీలో
ఉద్యోగం చేస్తున్న ప్రఖ్యాత నటులు శ్రీ పేకేటి శివరాం శ్రీ ఘంటసాల వారి
ప్రతిభను గుర్తించి ఆయనను కలకత్తాకు తీసుకొని వెళ్ళి పాటను రికార్డు
చేయించారట!.
క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ శ్రీ యం.సూరిబాబు " తొలినాటి గ్రామఫోన్
గాయకులు " పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అందులో ఆనాటి
గాయకుల ఫొటోలతో బాటు , వివరాలను పొందుబరచారు. అంతేకాదు
ఆనాడు వారు ఆలపించిన మధుర గీతాల సీడీని కూడా ఆపుస్తకంతో
జత పరచడం విశేషం. ధరకూడా అందుబాటులో 80 రూపాయలుగా
ఉంచడం అభినందనీయం. ఈ సిడీలో శ్రీ కపిలవాయి రామనాధశాస్త్రి,
ఉప్పులూరి సంజీవరావు, సి.ఎస్.ఆర్, అద్దంకి శ్రీరామమూర్తి, రామతిలకం,
వేమూరి గగ్గయ్య, దైతా గోపాలం, టి.రామకృష్ణశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరి
రావు, కన్నాంబ, పారుపల్లి సత్యనారాయణ, నాగయ్య, ఆరణి సత్యనారాయణ,
స్థానం నరసింహారావు, కొచ్చెర్లకోట సత్యనారాయణ, పి.సూరిబాబు, కె.రఘు
రామయ్య, బందా కనకలింగేశ్వరరావు, ఎస్.రాజేశ్వరరావు, టంగుటూరి
సూర్యకుమారి, మోహన్ పాటలున్నాయి ఈ గాయకుల సంక్షిప్త వివారాలను
శ్రీ మొదలి నాగభూషణశర్మగారు అందించారు. సంగీత అభిమానులు ప్రతి
ఒక్కరు స్వంతం చేసుకోవాల్సిన మంచి పుస్తకం ఇది.

1 comment: