Wednesday, March 30, 2011

అరుణకాంతుల తిలకందిద్దుకొన్న అందాల గోదావరమ్మ





కొండలలో కోనలలో వయ్యారంగా ఉరకలెత్తే గోదారమ్మ రాజమహేంద్రవరం
చేరుకోగానే గంభీరంగా సాగిపోతుంది. గోదారమ్మ నడుముకు వాడ్డానంగా
అమరిన రెండు వంతెనల మధ్య గోదావరి నది అందాలు పకృతి ప్రేమికులకు
మధురానుభూతిని కలిగిస్తుంది. ఆ పాత కొత్త వారధుల మధ్య ప్రతి ఏడాది
మార్చి చివరి రోజుల్లో సూర్యభగవానుడు నారింజరంగులో అగుపిస్తూ కన్నుల
పండుగగా వుంటాడు. రాజమండ్రి పుష్కరాలరేవు దగ్గర నిన్న సాయంత్రం
ఈ దృశ్యాల్ని నా కెమారాలో బంధించి మీ ముందుంచా.
రాజమండ్రి 16.98 డిగ్రీల ఉత్తర రేఖాంశం, 81.78 డిగ్రీల తూర్పు రేఖాంశంల
నడుమ ఉండటంతో సూర్యుని చుట్టూ భూభ్రమనంలో భాగంగా సూర్యుడు ఈ
రెండు వంతెనల మధ్య అస్తమిస్తూ అగుపిస్తాడు.
,

1 comment: