Saturday, March 12, 2011

ఓ తెలుగువాడా? ఎచటికోయి నీ పయనం?






అన్నపూర్ణావారి " వెలుగు నీడలు " చిత్రానికి శ్రీశ్రీ ఏనాడో వ్రాసిన
పాట "పాడవోయి భారతీయుడా" అన్న పాట నేటి పరిస్థితులకు సరిపోవడం
ఆశ్చర్యమే!
పదవీ వ్యామోహాలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగె నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకొనేవాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే!
స్వార్ధమే అనర్ధదాయకం !
అది చంపుకొనుటే క్షేమదాయకం !
ఇద్దరు తెలుగు వాళ్ళకు పడదు. ఓ తెలుగు వాడు వ్రాసిన @పద్యాన్ని ఆ పద్యం
అతనిడి కాదని సభలూ సమావేశాలు ఏర్పాటు చేస్తారు!. ఇప్పుడేమో కొందరు
తెలుగు వాళ్ళు విడి పోదామంటున్నారు. కొందరు తెలుగువాళ్ళు కాదు
కలసే వుండాలంటున్నారు. ఇద్దరిదీ మూర్ఘత్వమే. ఇలా తగవులతో దిన దిన
గండంగా బ్రతికే కంటే విడి పోతే అప్పుడు విడిపోయి సుఖపడాలనుకొనే వాళ్ళకి
ఆ సుఖమేమిటొ తెలిసి వస్తుంది. మొన్న టాంకు బండు పై జరిగిన విగ్రహాల
విధ్వంశం చాలా బాధాకరమైన సంఘటన. విగ్రహాలుపోతే మళ్ళీ ఏర్పాటు చేసు
కోవచ్చ అన్న మాట సరైనది కాదు. హైద్రాబాద్ నగరంలోని ఆ టాంక్ బండును
ప్రముఖుల శిల్పాలతో అలంకరించాలన్న ఆనాటి ముఖ్యమంత్రి కోరికను మన
తెలుగువాళ్ళతో సహా ఇతరులు అభినందించారు. ఇప్పుడేమో వాటిని సర్వనాశనం
చేశారు. ఒకనాడు మన రాజధాని సుందర నగరంగా, క్లీన్ సిటీగా పేరు పొందింది.
2004 తరువాత క్రమక్రమంగా మన రాజధాని అన్నివిధాల దిగజారింది.
National Geographic నవంబరు 2002 సంచికలో హైద్రాబాదు గురించి
ఆ పత్రిక GLOBAL CITIES పేరున వ్రాసిన సచిత్ర వ్యాసం చూడండి. తెలుగు
వాళ్ళంగా ఇప్పటి పరిస్థితికి తలలు దించుకొందాం.
<><><><><><><><><><><>
@ భరత ఖండంబు, చక్కని పాడియావు
హిందువులు, లేగదూడలై ఏడ్చు చుండ
తెల్లవారను, గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు, మూతులు బిగియగట్టి.
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసిన ఈ పద్యం ఆయన వ్రాయలేదంటూ
కొందరు తెలుగు వాళ్ళే సభలు చేసి అలజడి సృష్టించారు, కొంతకాలం క్రితం!
ఇదీ మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్య స్ఠితి!

4 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. Please read this poem It is a perfect reply to your post

    వి'గ్రహాల' విద్వంసం!
    జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..
    బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..
    అసలు నీకు 'ఆత్మ' ' గౌరవం' అంటే అర్థాలు తెలుసా..
    కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్
    తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్
    తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా

    వారు గొప్ప వారు కావొచ్చు..
    కాని నా తల్లి గుండె మీద
    నిప్పులై మండుతున్నారు
    ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే
    కనపడిందా మా గోస

    హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..
    భాషని, యాసని హేళన చేసి చూసే నీకు
    ఎక్కడిదిరా హక్కు
    జాతి గురించి ఊసెత్తడానికి

    అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన
    నా రాజుల చరిత్ర ఏది?
    ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన
    నా నిజాం పరిమళాలు కలుషితం చేసి
    మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,
    అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి
    ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..

    రాయి బద్దలయితే రాద్ధాంతం చేస్తున్నావ్,
    బొమ్మ పగిలితే గుండె పగిలినట్టు
    గంటలూ గంటలూ రొద పెడుతున్నావ్
    నువ్వు నిలబడ్డ జాగా నాది,
    నా జాగా చరిత్ర ఏది? సంస్కృతీ ఏది?

    నా బిడ్డలు ఏరి..
    ఓ గురజాడా, ఎర్ర ప్రగడ, ఇంకా ప్రజా కవులారా..
    మీరు చేసిన తప్పంతా..
    రక్త మాంసాలు తినే నర రూప రాక్షసుల చేతుల్లో పడడమే,
    మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మా జాతి ని మట్టు బెట్టి,
    మా చరిత్ర సమాధుల మీద మిమ్మల్ని నిలబెట్టడమే

    మేము గురి పెట్టింది మిమ్మల్ని కాక పోవచ్చు,
    మీరు చేసిన కృషిని కాకపోవచ్చు..
    మా ఆక్రోశం బద్దలు అయింది
    భాల్ల్లున పగిలింది మీ బొమ్మల పైన..

    మీ జాగా ఖాళి అయితేనే కదా
    మా చరిత్రలు నిలబడేది

    ఒకటి అంతం అయితేనే మరొకటి మొదలు..
    మా జాతి కోసం ప్రాణాలు అర్పించిన
    అమర వీరుల సమాధులకు కూడ
    జాగా లేదు, వారికి చోటియ్యనియండి,
    బొమ్మలకి బాద పడే మీరు..
    బిడ్డలు కళ్ళముందు కాలుతుంటే
    ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చ లేదే?
    కవితలు రాల లేదే, పుస్తకాలు అచ్చు కాలేదే ?

    మీ మాటలు కత్తుల్ల దిగుతుంటే
    ముక్కలైన మా మట్టిని ,
    బూడిదైన మా సంస్కృతిని
    మళ్లీ నిలబెట్టుకున్దామనే
    చరిత్రని మల్లా తిరగ రాస్తున్నాం,

    ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు
    స్తానం లేదు..అందమైన విగ్రహాలకు
    విడిది కాదు నా ఇల్లు,
    ఆగమైతున్న బతుకు చిత్రాలకు
    కొలువు..

    భుతల్లి కన్నీట మునుగుతున్నాం
    గర్భ శోకంతో కుంగి పోతున్నాం..
    మోసాలకు ఎత్తులకు జిత్తులకు
    విసిగి వేసారి ఉన్నాం..
    కొలిమిల్లాగా మండుతున్నాం..
    దగ్గర కొస్తే ఆగం అయితారు..

    మాట్లాడే సహనం లేదు,
    బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు
    మిగిలినవి చేతలు , చేతులే ..
    ఆవేశం అంటుకున్నది
    ఆవేదన అలుముకున్టున్నది..
    మంచి చెడుల మధ్య
    చెరిగిన రేఖ..
    న్యాయ అన్యాయాల మధ్య నలిగిన
    సత్యం..

    ఇప్పటికైనా ...
    నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..
    మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..
    మీ చరిత్రనూ నిలబెడతాం..
    మా చేతుల మీదుగా
    మేము ప్రశాంతంగా
    స్వేచ్చగా గాలి పిలచిన రోజు..


    ...సుజాత సూరేపల్లి
    http://nanokiran.blogspot.com/2011/03/blog-post_4586.html

    ReplyDelete
  3. నేను విడి పోకూడదని ఏనాడు అనలేదు. విధ్వశం వద్దని మాత్రమే అన్నాను.
    రెండు కుటుంబాల మధ్య విద్వేషం పెంచి తమ పగ్గం గడుపుకుంటున్న
    నాయకులను నిలదీయాలని నా కోరిక. ఆ రాజకీయ గ్రహాలను తరిమి
    కొట్టాలి!

    ReplyDelete
  4. సురేఖ గారు,
    ఇలాంటి బేవార్స్ గాళ్ళ కట్పేస్ట్ తవికలను చెత్తబుట్టలో వేయండి. కామెంటు రాయడం చేతకాని ఎదవలు ఇలా కట్ పేస్ట్ తవికలు రాసి ప్రచారం పొందుదామనుకుంటున్నరు. మీ బ్లాగ్ ఫ్లడ్ చేయగలరు, తీసేయండి. ఇలాంటి పనికిమాలిన ఎదవలని ప్రోత్సహించకండి.
    ధన్యవాదాలు.

    ReplyDelete