Monday, April 18, 2011

కార్టూన్ శ్రీ రామ కధ !!




1983లో నేను ఆంధ్రజ్యోతి, సచిత్ర వార పత్రికలో శ్రీరాముని మీద వేసిన
కార్టూన్ చూసిన కార్టూనిస్ట్ మితృలు శ్రీ రామశేషు ఆ నాటి నా
కార్టూనును, ఆనాటి రేడియో యుగం నుంచి నేటి కంప్యూటర్ యుగానికి
తీసుకొని వెళ్ళారు. శ్రీరామశేషు చేసిన మార్పును చూసిన మితృలు డాక్టర్
జయదేవ్ బాబు గారు మరో కొత్త కార్టూన్ను సృష్టించారు. ఇలా 28 ఏళ్ళ
క్రితం నేను గీసిన నా కార్టూనుకు ఇంతటి ప్రత్యేకతను కలుగచేసిన ఆ
ఇద్దరు మితృలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ కార్టూన్ గురించి మరో విషయం మీతో పంచుకోవాలి. ఆంధ్ర
జ్యోతి వీక్లీలో ఆ కార్టూన్ పూర్తిగా ప్రకటనలతో నిండిన పేజీలో ఓ మూల
వేశారు. లేఔటు చేసిన ఆ ప్రకటనల మధ్య ఓ మూల వుండటం
వల్ల ఆ కార్టూన్ చాలా మంది పాఠకుల దృష్టిలో పడలేదు. నేనే వీక్లీ
చూస్తూ ఆపేజీని స్కిప్ చేయడం జరిగింది. తరువాత ఈ విషయం
క్రోక్విల్; హాస్య పత్రిక నిర్వహిస్తున్న శ్రీ శంకు గారికి తెలియజేస్తే, ఆయన
వెంటనే రెస్పాండ్ అయి పత్రిక వాళ్ళతో మాట్లాడి ఇలాటి అన్యాయం ఇక
ముందు ఏ కార్టూనిస్ట్ కు ఎదురుకాకుండా చూస్తానని చెప్పారు. అదీ
ఆ శ్రీరాముని కార్టూన్ కధ! ఈ నాటికి మళ్ళీ మన కార్టూనిస్టు మితృలు
నా కార్టూన్ కు గుర్తింపును తీసుకొచ్చారు. అంతా ఆ శ్రీరాముని దయ!!
<><><><><><><><><>
తెలుగు కార్టూనిస్టులు, వాళ్ళ కార్టూన్లు, విశేషాలు తెలుసుకొనడానికి
telugucartoon.com చూడండి.
<><><><><><><><><><><>

No comments:

Post a Comment