Monday, April 18, 2011

జై హనుమాన్


స్వామి భక్తికి, కార్యనిర్వహణకు హనుమంతునికి మించిన వారు లేరు.
వాల్మీకి రామాయణం ఆంజనేయుని ప్రవేశంతోనే పాఠకులను భక్తి
పారవశ్యంలోనికి తీసుకొని వెళుతుంది. ఆంజనేయ స్వామి తొమ్మిది
అవతారాలను ధరించాడు.
1. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
2.శ్రీ వీరాంజనేయ స్వామి
3.శ్రీ వింశతిభుజాంజనేయ స్వామి
4. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి
5. శ్రీ అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి
6. శ్రీ సువర్చలాంజనేయ స్వామి
7..శ్రీ చతుర్భుజాంజనేయస్వామి
8.శ్రీ ద్వాత్రింశధ్భుజాంజనేయస్వామి
9.శ్రీ వానరాకార ఆంజనేయస్వామి
హనుమంతుడు కార్యశీలి. సీతాన్వేషణకు లంకకు వెళ్ళివచ్చిన తరువాత
"సీతాదేవిని ఛూశాను" అన్న ఏక వాక్యం చెబుతాడే కాని తను ఎంతటి
సాహసం చేసి సముద్రలంఖణతో లంకను చేరిన సంగతి ప్రస్తావించడు.
ఆ మాటను విన్న శ్రీరామచంద్రుడు వెంటనే లేచి హనుమంతుని గాఢంగా
కౌగలించుకుంటాడు. ప్రాజ్ఞుడైనవాడు తన కార్యసాధనలో తను చేసిన గొప్పలు
చెప్పుకోడు. హనుమంతునికి తన స్వామి ఆనందమే కావాలి. అందుకే ఒకే
ఒక వాఖ్యంతో " దృష్టా సీతా" అన్నాడు.
హనుమత్ స్తుతి
<><><><><><><>
బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం మరోగతాI
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాద్భవేత్II
బుద్ధి,బలం,కీర్తి,ధైర్యం,నిర్భయత్వం,అనారోగ్యం వంటి జాడ్యాలు తొలగడం
వాక్పటుత్వం మొదలైనవన్నీ హనుమంతుని స్మరణతో లభిస్తాయి. ఈ నాటి
యువత తెలుసుకోవలిసిన ఎన్నో విషయాలు మనకు సుందరకాండలో
కనిపిస్తాయి.
హనుమానుని జయంతి శుభ దినాన అందరికీ ఆయన శుభాశీస్సులు
కలగాలని కోరుకుంటూ...
( శ్రీబాపు గీసిన ఈ సుందర హనుమానుని చిత్రం శ్రీ ముళ్లపూడి రచనతో
వెలువడిన "రామాయణం" పుస్తకం (సంస్కృతి ఇంటర్నేషనల్ మద్రాసు)
సౌజన్యంతో)

No comments:

Post a Comment